PV Sindhu: శెభాష్ సింధు.. కేంద్రమంత్రుల సన్మానం
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన స్టార్ షట్లర్ పీవీ సింధును కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్లు మంగళవారం ఘనంగా సన్మానించారు.
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన స్టార్ షట్లర్ పీవీ సింధును పలువురు కేంద్రమంత్రులు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్, నిశిత్ ప్రమాణిక్ పాల్గొని సింధు క్రీడా ప్రతిభను కొనియాడారు. కఠోర శ్రమకు ప్రతిఫలంగా సింధు వరుసగా రెండోసారి ఒలింపిక్ పతకం సాధించడం గర్వకారణమని కిషన్రెడ్డి ప్రశంసించారు. నిరంతర సాధన, పట్టుదల, కుటుంబ సహకారం, కోచ్, సహాయకుల మద్దతుతో సింధు ఈ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. యువతకు సింధు ఆదర్శమని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. భారత్ నుంచి మెరిసిన గొప్ప ఒలింపియన్లలో సింధు కూడా ఒకరని ఆయన కొనియాడారు. 135 కోట్ల మంది భారతీయుల ముఖాల్లో ఆమె విజయం చిరునవ్వులు విరబూయించిందన్నారు. సింధు విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ పార్క్ తెసాంగ్ను కూడా మంత్రులు ఘనంగా సన్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.