జమాన్ 200 చేరుకోనివ్వకుండా.. డికాక్ ట్రిక్
క్రికెట్లో క్రీడాస్ఫూర్తి అనేదానికి ఎంతో విలువుంటుంది. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ ఆటగాళ్లు ఎలా ఆడారనేదే చాలా ముఖ్యమైన విషయం...
మరోసారి తెరపైకి క్రీడాస్ఫూర్తి వివాదం..
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్లో క్రీడాస్ఫూర్తి అనేదానికి ఎంతో విలువుంటుంది. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ ఆటగాళ్లు ఎలా ఆడారనేదే చాలా ముఖ్యం. అందుకు సంబంధించి ‘ఫెయిర్ ప్లే’ నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6)ను రనౌట్ చేసిన విధానం క్వింటన్ డికాక్కు చెడ్డపేరు తెచ్చేలా ఉంది. అది నిజంగానే క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా కనిపిస్తోంది.
తొలుత ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ సాధించింది. డికాక్(80), కెప్టెన్ బవుమా(92), వాండర్ డసెన్(60), మిల్లర్(50) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఒకవైపు ఓపెనర్ జమాన్ వికెట్ కాపాడుకుంటూ ఒంటరిపోరాటం చేస్తుండగా మరోవైపు వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలోనే చివరి ఓవర్లో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో జమాన్(192) పరుగులతో ద్విశతకానికి చేరువలో ఉన్నాడు.
అయితే, ఎంగిడి వేసిన తొలి బంతికి డబుల్ రన్ తీయబోయిన జమాన్ రెండో పరుగు పూర్తి చేసే సమయంలో రనౌటయ్యాడు. ఫీల్డర్ మార్క్రమ్ డైరెక్ట్ త్రో విసరడంతో పెవిలియన్ చేరాడు. కానీ, ఇక్కడే దక్షిణాఫ్రికా కీపర్ క్వింటన్ డికాక్ ఓ మాయ చేశాడు. జమాన్ రెండో పరుగు కోసం క్రీజులోకి వస్తుండగా ఫీల్డర్ త్రో విసిరిన బంతి నాన్ స్ట్రైకర్ వైపు వెళ్తున్నట్లు సైగలు చేశాడు. దాంతో పాక్ బ్యాట్స్మన్ అటువైపు తిరిగి చూశాడు. ఈలోపే బంతి వికెట్లకు తాకడంతో అతడు రనౌటయ్యాడు. కాగా, రీప్లేలో డికాక్ ఉద్దేశపూర్వకంగా జమాన్ను మాయ చేసే విధంగా కనిపించింది. చివరికి పాక్ 50 ఓవర్లలో 324/9తో నిలిచింది. దక్షిణాఫ్రికా 17 పరుగులతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే జమాన్ వన్డేల్లో రెండో ద్విశతకం చేజార్చుకున్నాడు. దీన్ని పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టారు. డికాక్ చేసింది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా