Ashwin: పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు అశ్విన్ ఘాటు స్పందన!
భారత్ - పాకిస్థాన్ (IND vs AUS) మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్లు లేవు. అలాగే పాక్లో జరిగే టోర్నీలను కూడా వేరే చోటుకు మార్చేస్తుంటారు. భారత్ ఎలాగూ అక్కడికి పోదు. సంపద, ఆటపరంగా పెద్ద జట్టు లేకుండా టోర్నీ విజయవంతం కావడం కష్టం. ఇప్పుడు ఆసియా కప్ 2023 (Asia Cup 2023) విషయంలోనూ అదే పరిస్థితి ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ 2023 (Asia Cup 2023) టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్లో టీమ్ఇండియా ఆసియా కప్ ఆడకపోతే.. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో పాక్ ఆడేదిలేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజామ్ సేథీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఆసియా కప్ కౌన్సిల్ (ACC) సమావేశంలో జై షా (Jay Shah)తో నజామ్ సేథీ చెప్పినట్లు కూడా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. తాజాగా పాక్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఘాటుగా స్పందించాడు. వన్డే ప్రపంచకప్ను ఆడకుండా పాక్ వదిలేస్తుందని అనుకోవడం లేదని వ్యాఖ్యానించాడు.
‘‘పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ను నిర్వహిస్తే.. పాక్లో ఆడేదిలేదని టీమ్ఇండియా ప్రకటించింది. కాబట్టి, మేం పాల్గొనేది లేదు. ఒకవేళ భారత్ ఆడాలని భావిస్తే మాత్రం ఆసియా కప్ వేదికను మార్చాలి. అయితే, ఇలా చాలాసార్లు జరిగిందనే చెప్పాలి. ఆసియా కప్ అక్కడ నిర్వహించొద్దని మేం చెప్పాం. అలాగే వాళ్లు ఇక్కడకు వచ్చేది లేదని చెబుతూనే ఉన్నారు. కానీ, వరల్డ్ కప్లో పాక్ ఆడకుండా ఉండటం మాత్రం అసాధ్యం. ఇక టోర్నీ నిర్వహణకు సంబంధించి తుది నిర్ణయం ఏసీసీదే. అయితే, యూఏఈకి బదులు శ్రీలంకకు తరలిస్తే బాగుంటుంది. భారత్లో జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నీకి కూడా కాస్త దోహదపడుతుంది. ఇప్పటికే చాలా టోర్నమెంట్లు యూఏఈ వేదికగా నిర్వహించారు. ఈసారి యూఏఈకి బదులు శ్రీలంకకు తరలిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం’’ అని అశ్విన్ తెలిపాడు. సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ వేదికపై మార్చిలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.