Ashwin: ‘అతిగా ఆలోచిస్తాడు’... కామెంట్లపై ఘాటుగా స్పందించిన అశ్విన్
బంగ్లాదేశ్పై అద్భుత విజయం సాధించడంలో రవిచంద్రన్ అశ్విన్ది కీలక పాత్ర. బౌలింగ్లోనే కాకుండా కీలక సమయంలో బ్యాటింగ్లోనూ రాణించి ఓటమి నుంచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే తనపై వచ్చే విమర్శలకు ఎప్పటికప్పుడు తన ఆటతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ సమాధానం ఇస్తుంటాడు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే క్రికెటర్లలో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఒకడు. విభిన్న అంశాలపై చర్చలు నిర్వహిస్తూ.. అభిమానుల సందేహాలకు సమాధానాలు ఇస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్పై రెండో టెస్టులో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ బ్రెయిన్గా పరిగణించే అశ్విన్ కూడా కొన్నిసార్లు అతిగా ఆలోచించేవాడిగా కనిపిస్తాడనే వాదనా ఉంది. దీంతో ఇలాంటి కామెంట్లపై అశ్విన్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.
‘‘అతిగా ఆలోచించడం అనేది నేను భారత జెర్సీని ధరించినప్పటి నుంచి నేను అనుసరించిన విధానం. అయితే ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మార్గంలో ఆలోచించాను. కానీ అభిమానుల మనస్సులో నుంచి ఆ పదం తొలగించడానికి నా పీఆర్ టీమ్ కాస్త సీరియస్గా దృష్టి సారించాలి. ఇక్కడ ప్రతి వ్యక్తి గమనం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే కొందరు మాత్రం అతిగా ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు చాలా సింపుల్గా ఉంచుకోగలరు. బయట నుంచి నాపై ‘అతిగా ఆలోచిస్తాడు’ అంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అలా అన్నప్పుడు నేను కూడా దాని గురించి ఆలోచిస్తుంటా. అయితే నేను ఆడే విధానంపై నాకంటూ స్పష్టత ఉంటుంది. ఇలాగే ఆడాలని ఇతరులను రికమండ్ చేయను’’
‘‘నా గేమ్ గురించి లోతుగా ఆలోచిస్తా. అలాగే నా అభిప్రాయాలను అందరితో పంచుకుంటా. అవన్నీ జనాదరణ పొందకపోవచ్చు. కానీ నేను మాటల యుద్ధంలో గెలవాలని అనుకోవడం లేదు. అలా పంచుకోవడం వల్ల వచ్చే దాని నుంచి నేర్చుకోవడానికి మాత్రమే చూస్తా. చివరిగా నేను ఇక్కడ ఓ గమనిక పెడుతున్నా. నా సహచరులు, అభిమానులు లేదా ఇతరుల నుంచి నాకెలాంటి సమస్య లేదు. ఇలా నేను ట్వీట్లు పెట్టడానికి కారణం కూడా ఉంది. గత కొంతకాలంగా వస్తున్న కొన్ని ఆర్టికల్స్పై స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ‘అతిగా ఆలోచిస్తాడు’ అనే పదం ముప్పుగా మారుతుందని అర్థం చేసుకోవడానికి నాకు దాదాపు 13 సంవత్సరాలు పట్టింది. అందుకే నేను పెట్టిన ట్వీట్లను చదివిన కొంతమంది యువకులకైనా కొన్నేళ్ల తర్వాత నేర్చుకొంటారని ఆశిస్తున్నా’’ అని అశ్విన్ సుదీర్ఘంగా పోస్టులు పెట్టాడు.
అశ్విన్ గత కొంతకాలంగా జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్లో పెద్దగా రాణించకపోయినా అన్ని మ్యాచ్ల్లో ఆడే అవకాశం అశ్విన్కు దక్కింది. అలాగే యువ స్పిన్నర్లను కాదని సీనియర్కు చోటు కల్పించడంపైనా విమర్శలు రేగాయి. ఈ క్రమంలో తనకు తాను ఎక్కువగా అంచనా వేసుకొంటూ ‘అతిగా ఆలోచిస్తున్నాడు’ అంటూ పలు కామెంట్లు రావడంతో అశ్విన్ ఘాటుగా స్పందించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సింగ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?