Ashwin: భారత టెస్టు జట్టు కెప్టెన్సీకి అశ్విన్ అర్హుడు: డానిష్ కనేరియా
భారత టెస్టు కెప్టెన్సీకి అన్ని విధాలా అర్హత కలిగిన వ్యక్తి రవిచంద్రన్ అశ్విన్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు కెప్టెన్సీకి అన్ని విధాలా అర్హత కలిగిన వ్యక్తి రవిచంద్రన్ అశ్విన్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నాడు. మిర్పూర్ టెస్టులో బంగ్లాదేశ్పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను అతడు విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టెస్టు కెప్టెన్సీకి అశ్విన్ కూడా మంచి ఎంపిక అవుతాడని కనేరియా అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ చురుగ్గా రాణించగలడని ప్రశంసించాడు.
‘‘భారత టెస్టు కెప్టెన్సీకి అన్ని విధాలా అర్హత కలిగిన వ్యక్తుల్లో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. అతనిలో ఇంకా చాలా క్రికెట్ దాగి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లో అతడి తెలివితేటలు, చురుకుదనం అద్భుతం. మైదానంలో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తాడు. భారత్ ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా అశ్విన్ ప్రశాంతంగా ఉన్నాడు. కష్టకాలంలో గొప్ప ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. చాలా సందర్భాల్లో తన బ్యాటింగ్తో అశ్విన్ భారత్ను గట్టెక్కించాడు. గతంలో అనిల్కుంబ్లే లేకుండా ఆడినప్పుడు భారత్ బలహీనంగా కనిపించింది. ఇప్పుడు అశ్విన్ విషయంలోనూ అదే జరుగుతోంది. అతడు చేసిన 42 పరుగులు సెంచరీతో సమానం’’ అని అశ్విన్పై ప్రశంసల వర్షం కురిపించాడు కనేరియా.
ఆ క్యాచ్ వదిలేయడంతో..
బంగ్లా ఫీల్డర్ మోమినుల్ హక్ గొప్ప ఫీల్డర్ కానీ అతడు అశ్విన్ క్యాచ్ వదిలేసి భారత్కు విజయాన్ని బహుమతిగా ఇచ్చాడని కనేరియా అన్నాడు. ‘‘మోమినుల్ హక్ గొప్ప ఫీల్డర్. అతడు ఎన్నో అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. కానీ బంగ్లాకు కీలకమైన దశలో అశ్విన్ క్యాచ్ను మాత్రం వదిలేశాడు. కీలక దశలో క్యాచ్ వదిలేయడం భారత్కి వరంగా మారింది’’ అని కనేరియా అన్నాడు.
అఫ్రిదిపై సంచలన ట్వీట్..
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నియమించిన విషయం తెలిసిందే. అఫ్రిది నియామకంపై డానిష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాల్ టాంపరింగ్కి పాల్పడిన వ్యక్తి చీఫ్ సెలెక్టర్గా నియమితులయ్యారని అర్థం వచ్చేలా ‘బంతిని కొరుకుతున్న అఫ్రిది’ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?