indian cricket team: బౌలర్ల కోసం బిజినెస్క్లాస్ సీట్లు వదులుకొన్న ద్రవిడ్, రోహిత్, కోహ్లీ..!
బౌలర్ల ఇబ్బందిని గుర్తించిన టీమ్ ఇండియా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది. వారిని సౌకర్యవంతంగా ఉంచేందుకు సీనియర్ ఆటగాళ్లకు తమకు ఇచ్చిన బిజినెస్ క్లాస్ సీట్లను వదులుకొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా చిన్నచిన్న విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉంటోంది. జట్టులో తోటి సభ్యుల అవసరాల కోసం మిగిలిన ఆటగాళ్లు త్యాగాలు చేశారు. తాజాగా అటువంటి నిర్ణయం ఒకటి వెలుగులోకి వచ్చింది. టీమ్ ఇండియా కోచ్, జట్టు కీలక సభ్యులు కొందరు తమకు కేటాయించిన సౌకర్యాలను బౌలర్లకు ఇచ్చారు. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమకు ఇచ్చిన బిజినెస్ క్లాస్ సీట్లను బౌలర్లు మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, పాండ్యాకు ఇచ్చారు. టోర్నికి ముందే దీనికి సంబంధించి జట్టు నిర్ణయించుకొంది. బౌలర్లు మైదానంలో పూర్తిస్థాయిలో ప్రతిభ చూపాలంటే.. ఫీల్డ్ బయట వారి కాళ్లు, వెన్నెముకకు వీలైనంత విశ్రాంతి కల్పించాలని భావించారు. ఈ విషయాన్ని జట్టులోని సిబ్బంది ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టుకు నాలుగు బిజినెస్ క్లాస్ సీట్లు కేటాయిస్తారు. చాలా జట్లలో ఈ సీట్లను కోచ్, కెప్టెన్, సీనియర్ ఆటగాడు లేదా వైస్ కెప్టెన్, మేనేజర్కు కేటాయిస్తాయి. కానీ, భారత వ్యూహ బృందం మాత్రం ఆస్ట్రేలియాలో ప్రతి మూడు నాలుగు రోజులకోసారి విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని దృష్టిలోపెట్టుకొంది. ఈ నేపథ్యంలో జట్టులోని పేసర్లకు వీలైనంత సౌకర్యవంతమైన సీట్లను కేటాయించాలని నిర్ణయించింది. దీంతో సాధారణంగా జట్టులో బిజినెస్ క్లాస్ సీట్లను పొందేవారు.. వాటిని బౌలర్లకు వదులుకొన్నారు. టోర్నమెంట్ పూర్తయ్యే నాటికి జట్టు మూడు టైమ్ జోన్లలో 34,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో స్థానిక విమాన ప్రయాణాలే కనీసం నాలుగైదు గంటలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్