ఆ ముగ్గురి కాంబినేషన్.. కొత్త శిఖరాలకు భారత క్రికెట్: హర్భజన్
భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో సారథులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత క్రికెట్ను మరింత ఉన్నతస్థాయికి ...
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో సారథులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత క్రికెట్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్ కోచ్గా ఉండటం వల్ల జట్టులోని ఆటగాళ్లకు భరోసా, స్థిరత్వం వస్తుందని పేర్కొన్నాడు. ‘‘ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. రాహుల్ రావడంతో ఆటగాళ్లకు వారి ప్రదర్శనపై నమ్మకం కలుగుతుంది. జట్టులో స్థానంపై భరోసా ఉంటుంది. యువకులకు మంచి అవకాశాలు వస్తాయి. ఎలాంటి అన్యాయం జరగదు. అకారణంగా జట్టు నుంచి మిమ్మల్ని (క్రికెటర్లనుద్దేశించి) తప్పించరు. చాలా అవకాశాలను కల్పించేందుకు రాహుల్ ప్రయత్నిస్తాడు. జట్టులో స్థిరత్వం తీసుకొస్తాడు’’ అని వివరించాడు.
కొత్త కోచ్ ద్రవిడ్, కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కుదురుకోవడానికి కాస్త సమయం పట్టొచ్చని హర్భజన్ అంచనా వేశాడు. అలాగే ద్రవిడ్ను కోచ్గా నియమించడంపై మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా మేనేజ్మెంట్ను అభినందించాడు. రాహుల్ ద్రవిడ్కి కోహ్లీ గౌరవం ఇస్తాడని, తనకు కూడా కావాలని విరాట్ డిమాండ్ చేయడని పేర్కొన్నాడు. ‘‘క్రికెటర్గా భారత జట్టుకు ఏం చేశాడు.. వ్యక్తిగతంగా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడనేదే రాహుల్లో కోహ్లీ చూస్తాడు. టెస్టు మ్యాచ్లకు వస్తే రాహుల్ హృదయం దగ్గరగా ఉండే ఫార్మాట్ ఇదే. ఈ విషయం కోహ్లీకి కూడా తెలుసు. చాలా మ్యాచ్ల సందర్భంగా చెప్పాడు’’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. కివీస్తో రెండు టెస్టుల సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు అందుబాటులో ఉండని కోహ్లీ స్థానంలో రహానె సారథ్యం వహిస్తాడు.
పిచ్ ఎలా ఉండనుందంటే?
భారత్, కివీస్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగే కాన్పూర్ స్టేడియం సిద్ధమైపోయింది. అనువైన పిచ్ను తయారు చేయాలని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, సారథి అజింక్య రహానె నుంచి ఎలాంటి సూచనలు అందలేదని క్యూరేటర్ శివకుమార్ వెల్లడించారు. ఉత్తమమైన పిచ్ను రూపొందించామని పేర్కొన్నాడు. నవంబర్ నెలలో పిచ్ మీద కొంత తేమ ఉంటుందని, అయితే ట్రాక్ దృఢంగా ఉండి పగుళ్లు రావని మాత్రం చెప్పగలనని తెలిపాడు. ఆతిథ్యం దేశం జట్టు తమకు అనువుగా ఉండే పిచ్లను తయారు చేయించుకుంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కేవలం మూడు రోజులకే మ్యాచ్లు ముగుస్తున్న సంఘటనలను చూస్తున్నామని, ఇక్కడ మాత్రం అలా జరగదని గ్యారంటీ ఇచ్చాడు. అయితే రెండో రోజు నుంచి కాస్త బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని క్యూరేటర్ శివకుమార్ వివరించారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ