Asia cup 2022: ఆ పదం పలకడానికి ఇష్టపడని ద్రవిడ్..!
క్రికెట్లో టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్కు జంటిల్మెన్గా పేరుంది. ఆయన మాటతీరు, ప్రవర్తన హుందాగా ఉంటాయి. ఈ విషయాన్ని మరోసారి
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్లో టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు జెంటిల్మెన్గా పేరుంది. ఆయన మాటతీరు, ప్రవర్తన హుందాగా ఉంటాయి. ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకొన్నాడు. పాక్తో మ్యాచ్కు ముందు నిర్వహించే ప్రీమ్యాచ్ ప్రెస్కాన్ఫరెన్స్లో ఓ సరదా ఘటన చోటు చేసుకొంది. ఓ పదం నోటిదాకా వచ్చినా.. పలక్కుండా ద్రవిడ్ నియంత్రించుకొని విలేకర్లకు సమాధానం ఇచ్చాడు.
శనివారం సాయంత్రం ద్రవిడ్ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కొందరు విలేకర్లు ద్రవిడ్ను పాక్ బౌలింగ్ లైనప్పై ప్రశ్నించారు. దీనికి ద్రవిడ్ సమాధానమిస్తూ.. ‘‘హా.. వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. నేను దానిని కాదనను. కానీ, మా కుర్రాళ్లు కూడా వారిని 147 వద్దే అడ్డుకోగలిగారు. కొన్ని సార్లు అంకెల్లో ఒకరు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులేశారని.. మరొకరు గంటకు 147 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నట్లు ఉంటుంది. అంతిమంగా బౌలింగ్ గణాంకాల విశ్లేషణే ముఖ్యం. చివరికి మనం గంటకు 135, 145 లేదా 125 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తున్నామా.. బంతిని స్వింగ్ చేస్తున్నామా లేదా అన్నది కాదు. ఫలితాలే ముఖ్యం. మన బౌలర్ల గణంకాలు బాగున్నాయి. నేను పాక్ బౌలింగ్ను గౌరవిస్తాను. కానీ.. మనకూ మంచి బౌలింగ్ దళం ఉంది. మేము గ్లామర్గా కనిపించకపోవచ్చు. కానీ, ఫలితాలు సాధించే కుర్రాళ్లు మావద్ద ఉన్నారు’’ అని పేర్కొన్నాడు.
ఈ క్రమంలో బౌలింగ్ దళం గురించి చెబుతూ.. నోటిదాకా వచ్చిన ఓ పదాన్ని రాహుల్ బలవంతంగా ఆపుకోవడాన్ని విలేకర్లు గమనించారు. ఆ పదం ‘ఎగ్జూబిరెంట్’ (అతిశయమైన) కదా అని ఓ విలేకరి రెట్టించి అడిగారు. దీనికి స్పందించిన ద్రవిడ్ ‘‘లేదు.. అదికాదు. అది ‘ఎస్’(S)తో మొదలయ్యే నాలుగు అక్షరాల పదం’’ అని చెప్పాడు.
ఆసియాకప్లో సూపర్-4 దశలో నేడు భారత్-పాక్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో భారత్ ఒకసారి పాక్ను ఓడించింది. అదే సమయంలో భారత్ బౌలర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టు నుంచి వైదొలగ్గా.. మరోవైపు పాక్ బౌలర్ షానవాజ్ దహానీ కూడా గాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?