Virat - Dravid: నన్ను 16 నెలలు వెయిట్ చేయించావు.. విరాట్ కోహ్లీతో రాహుల్ ద్రవిడ్
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ నిరీక్షణకు తెరపడింది. తొలుత టీ20.. ఆ తర్వాత వన్డేల్లో... తాజాగా టెస్టుల్లోనూ సెంచరీ బాదేసి భారం మొత్తం దించేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడున్నరేళ్ల తర్వాత టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) టెస్టు సెంచరీ సాధించాడు. 2019 నుంచి గతేడాది ఆసియా కప్ వరకు (2022) ఏ ఫార్మాట్లోనూ శతకం నమోదు చేయని విరాట్.. తొలుత టీ20లతో శతక జోరును ప్రారంభించి తాజాగా ఆసీస్పై టెస్టు సెంచరీని కొట్టేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ ఖాతాలో 75 శతకాలు ఉన్నాయి. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టు మ్యాచ్లో 186 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీతో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా మాట్లాడాడు.
డ్రెస్సింగ్ రూమ్ నుంచి టెస్టు సెంచరీ చూసేందుకు దాదాపు 16 నెలలపాటు వేచి ఉండేలా చేశావని విరాట్నుద్దేశించి ద్రవిడ్ అన్నాడు. వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘‘నేను కోచ్గా (2021 నవంబర్) వచ్చినప్పటి నుంచి నీ టెస్టు సెంచరీ కోసం ఎదురు చూస్తున్నా. అలా నన్ను 16 నెలల పాటు వేచి ఉండేలా చేశావు. అయితే, ఆసీస్పై నువ్వు ఆడిన ఈ ఇన్నింగ్స్ అద్భుతం’’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. వెంటనే విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలిలో స్పందించాడు. సెంచరీని తానూ ఎంతో ఆస్వాదించానని, ఇంతకుముందు కూడా ఇంతకంటే మంచి ఇన్నింగ్స్లే ఆడినట్లు చెప్పాడు.
‘‘రాహుల్ భాయ్ ధన్యవాదాలు. ఈ ఇన్నింగ్స్కు సంబంధించినంత వరకు ఆందోళనేం లేదు. ఎందుకంటే దీనికంటే ముందు వరకు కూడా చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడా. అయితే, అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. కానీ, ఆసీస్ జట్టు మాత్రం నా కోసం ఫీల్డింగ్ సెటప్ను పెట్టింది. పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోయినా మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ మాత్రం కట్టుదిట్టంగా బంతులను సంధించారు. ఎక్కువ సమయం 7-2 ఫీల్డింగ్ను పెట్టారు. సర్కిల్ లోపల ఏడుగురు.. బౌండరీ లైన్లో కేవలం ఇద్దరిని మాత్రమే ఉంచారు. నా డిఫెన్స్ మీద నాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. గతంలోనూ టెస్టు క్రికెట్లో ఇలానే ఆడా’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా