Rahul Dravid: పంత్ టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్లో అంతర్భాగం: ద్రవిడ్
రాబోయే కొద్ది నెలలవరకు టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ జట్టులో అంతర్భాగమని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: రాబోయే కొద్ది నెలలవరకు టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ జట్టులో అంతర్భాగమని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో పంత్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. సిరీస్ 2-2తో సమమైనా.. అతడు బ్యాటర్గా విఫలమయ్యాడు. మరోవైపు దినేశ్ కార్తీక్ క్లిక్ అవ్వడం.. పొట్టి ఫార్మాట్లో పంత్ నిలకడలేమి కారణాలతో రాబోయే టీ20 ప్రపంచకప్లో ఉంటాడా లేదా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ గతరాత్రి ఐదో టీ20 రద్దయ్యాక మీడియాతో మాట్లాడాడు.
‘పంత్ దూకుడుగా ఆడే క్రమంలో ఈ సిరీస్లోని పలు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. కానీ, అతడికి ఉన్న శక్తి సామర్థ్యాల మేరకు అతడు టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్లో అంతర్భాగమే. అలాగే అతడు ఎడమచేతి వాటం గల బ్యాట్సమన్ కావడంతో మధ్య ఓవర్లలో మాకు చాలా కీలకమైన ఆటగాడు. రాబోయే కొద్ది నెలల్లో మా ప్రణాళికల పరంగా అతడు కీలక ఆటగాడిగా ఉంటాడు. అలాగే ఈ ఒక్క సిరీస్తోనే అతడి కెప్టెన్సీని అంచనా వేయలేం. అతడో యువ సారథి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. 0-2 నుంచి 2-2తో సిరీస్ సమం చేయడం మంచి విషయం’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
అనంతరం దినేశ్ కార్తీక్పై స్పందించిన ద్రవిడ్.. గత రెండు మూడు నెలల నుంచి అతడు ఆడుతున్న తీరు నేపథ్యంలో ఈ సిరీస్కు ప్రత్యేకంగా ఎంపిక చేశామని, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడని తెలిపాడు. రాజ్కోట్లో భారీ ఇన్నింగ్స్ అవసరమైన వేళ చెలరేగిపోయాడని గుర్తుచేశాడు. హార్దిక్ పాండ్యతో కలిసి చివరి ఐదు ఓవర్లు ఉతికారేశాడని చెప్పాడు. కార్తీక్ ఇలా రాణించడం రాబోయే రోజుల్లో జట్టుకు మరింత ఉపయోగమని పేర్కొన్నాడు. యువకులకు అవకాశం వస్తే కేవలం పరుగులు చేయడం కాకుండా కార్తీక్లా రెచ్చిపోవాలని సూచిస్తానని అన్నాడు. కాగా, గతరాత్రి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ పూర్తయ్యాక ద్రవిడ్తో పాటు శ్రేయస్ అయ్యర్, రిషభ పంత్ నేడు ఇంగ్లాండ్ బయలుదేరనున్నారు. అక్కడ టీమ్ఇండియా టెస్టు జట్టుతో కలవనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్