IND vs SA: జట్టు అలా ఉండటానికి కోహ్లీ నాయకత్వమే కారణం: రాహుల్ ద్రవిడ్
దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా విజయంతో ఆరంభించింది. సెంచూరియన్లో గురువారం ముగిసిన తొలి టెస్టులో టీమ్ఇండియా.. అతిథ్య జట్టుపై 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టెస్టుల
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా విజయంతో ఆరంభించింది. సెంచూరియన్లో గత గురువారం ముగిసిన తొలి టెస్టులో టీమ్ఇండియా.. అతిథ్య జట్టుపై 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఈ టెస్టులో భారత్ గెలుపొందడానికి కోహ్లీ నాయకత్వమే కారణమని టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టులో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటంలో విరాట్ పాత్ర ఎంతో ఉందని ప్రశంసించాడు. ‘ఈ ప్రత్యేకమైన టెస్ట్ మ్యాచ్కి నాయకత్వం వహిస్తున్నప్పుడు చుట్టూ ఎంతో గందరగోళం పరిస్థితులు ఉన్నాయి. కానీ, అలాంటి సమయంలోనూ జట్టు సభ్యుల్లో ఉత్సాహం, మనోబలం తగ్గకుండా చూసుకోవడం అంతా తేలికైన పని కాదు. ఈ బాధ్యతలను కెప్టెనే స్వయంగా చూసుకోవాలి. విరాట్ కోహ్లీ గత 20 రోజులుగా అద్భుతంగా వ్యవరిస్తున్నాడు. అతను శిక్షణ పొందిన విధానం, జట్టు సభ్యులతో మమేకం కావడం వల్లే ప్రస్తుతం టీమ్ఇండియా ఈ స్థాయిలో ఉంది. కోహ్లీ అద్భుతమైన నాయకుడు. జట్టులో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటానికి అతడి నాయకత్వం సహాయపడింది’ అని రెండో టెస్టుకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ద్రవిడ్ అన్నాడు.
‘ఇలాంటి (కోహ్లీ) వారితో కలిసి పనిచేయడం కష్టంగా ఉండదు. వ్యక్తిగతంగానూ కోహ్లీ ప్రశాంతంగా ఉంటాడు. అతడు బాగా బ్యాటింగ్ చేశాడు. కానీ, మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మరల్చలేకపోయాడు. త్వరలోనే అతడు భారీ స్కోర్లు చేస్తాడని భావిస్తున్నా’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. తొలి టెస్టులో విజయం సాధించి జోరు మీదున్న టీమ్ఇండియా.. రెండో టెస్టులోనూ సత్తాచాటి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అంతేకాదు దక్షిణాఫ్రికా గడ్డపై మొదటిసారి టెస్టు సిరీస్ను దక్కించుకుని చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రేపటి నుంచి (జనవరి 3) జోహన్నెస్బర్గ్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.