IND vs WI : ఆధిక్యం కోసం భారత్ పోరాటం.. సమం చేసేందుకు విండీస్ యత్నం.!
కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన చారిత్రక 1,000 వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు మంచి జోష్ మీద ఉంది. అదే జోష్తో రెండో వన్డేలోనూ పై చేయి సాధించి సిరీస్ సొంతం..
ఇంటర్నెట్ డెస్క్ : కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన చారిత్రక 1,000 వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు మంచి జోష్ మీద ఉంది. అదే జోష్తో రెండో వన్డేలోనూ పై చేయి సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరో వైపు తొలి వన్డేలో పరాజయం పాలైన వెస్టిండీస్.. రెండో వన్డేలో గెలుపొంది సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. బుధవారం (ఫిబ్రవరి 9న) జరుగనున్న మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి.!
* రాహుల్ స్థానంపై సందిగ్ధం..
గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్లో ఉండటం టీమ్ఇండియాకు సానుకూలాంశం. రెండో వన్డేకి వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రానున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా క్వారంటెయిన్ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ అందుబాటులోకి రావడంతో టీమిండియా మరింత బలోపేతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, తుది జట్టులో ఎవరికి చోటివ్వాలనే విషయంపై కొంత గందరగోళం నెలకొంది. తొలి వన్డేలో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసిన యువ ఆటగాడు ఇశాన్ కిషన్ (28: 36 బంతుల్లో 2×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. ఒక వేళ కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగితే.. ఇశాన్కి జట్టులో చోటు దక్కడం కష్టమే. రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్కి వస్తే.. అరంగేట్ర ఆటగాడు దీపక్ హుడాను పక్కన పెట్టే అవకాశం ఉంది. తొలి వన్డేలో దీపక్ (26 నాటౌట్: 32 బంతుల్లో 2×4) రాణించాడు.
* విరాట్ రాణించాలి..
సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ స్థానానికి ఎలాంటి ఢోకాలేదు. అయినా, చాలా రోజులుగా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న విరాట్.. రెండో వన్డేలో రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే, ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న శతక దాహాన్ని ఈ మ్యాచ్లోనైనా తీర్చుకుంటాడేమో చూడాలి. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగే రిషభ్ పంత్, సూర్యకుమార్ స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.
* కుల్దీప్ యాదవ్కి చోటు కష్టమే.!
మరో వైపు, స్పిన్ ద్వయం యుజ్వేంద్ర చాహల్ (4/49), వాషింగ్టన్ సుందర్ (3/30) తొలి వన్డేల్లో అదరగొట్టారు. కాబట్టి, వీరిద్దరినీ పక్కన పెట్టడం అసాధ్యం. ఈ నేపథ్యంలో జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కి అవకాశం దొరకడం కష్టమే. అలాగే, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (2/29), కట్టుదిట్టమైన బౌలింగ్తో రాణించిన మహమ్మద్ సిరాజ్లను కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి, బౌలింగ్ విభాగంలో దాదాపు మార్పులు లేనట్టే.
* విండీస్ సమష్టిగా రాణిస్తేనే..
గత కొద్ది కాలంగా వెస్టిండీస్ జట్టు నిలకడగా రాణించలేకపోతోంది. విండీస్ ఆడిన గత 16 వన్డేల్లో.. 10 మ్యాచుల్లో ఆఖరు వరకు బ్యాటింగ్ చేయలేకపోయింది. ఆ జట్టు అన్ని విభాగాల్లో మెరుగు పడాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్లో సమూల మార్పులు అవసరం. తొలి వన్డేలో ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ (57: 71 బంతుల్లో 4×6) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బౌలర్ అల్జారీ జోసెఫ్ (2/45) ఫర్వాలేదనిపించాడు. కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పెవిలియన్కి పంపించాడు. భారత్కి పోటీనివ్వాలంటే రెండో వన్డేలో బ్యాటర్లు నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ రాణించాల్సిన అవసరం ఉంది.
తుది జట్ల అంచనా :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్ : బ్రెండన్ కింగ్, శాయి హోప్ (వికెట్ కీపర్), డారెన్ బ్రావో, బ్రూక్స్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫేబియన్ అలెన్, అకీల్ హోసెయిన్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి