RR vs RCB: ఆ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు: సంజూ శాంసన్
ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన రాజస్థాన్ (RR).. కీలక సమయంలో మాత్రం డీలాపడిపోయింది. ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకొనే పరిస్థితికి వచ్చింది. తాజాగా బెంగళూరు చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. జైపుర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ను కేవలం 59 పరుగులకే కుప్పకూల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. ఈ క్రమంలో రాజస్థాన్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుత సీజన్లో ఇదే అత్యల్ప స్కోరు కాగా.. రాజస్థాన్ జట్టుకు ఇది రెండోది కావడం గమనార్హం. అంతకుముందు 2009 సీజన్లో బెంగళూరుపైనే 58 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా మాత్రం బెంగళూరే ఉండటం విశేషం. 2017 సీజన్లో కోల్కతాపై ఆర్సీబీ 49 పరుగులకే కుప్పకూలింది.
ఈ ఓటమితో రాజస్థాన్కు ప్లేఆఫ్స్ ఛాన్స్లు సన్నగిల్లాయి. తన చివరి మ్యాచ్లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంది. తొలి ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్.. గత ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లోనే గెలవడం గమనార్హం. ఈ క్రమంలో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంచి ఆరంభం వచ్చినా వెనుకంజ వేయడానికిగల కారణం ఏంటనే వ్యాఖ్యాత ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
‘‘మీరు అడిగిన ప్రశ్న గొప్పగానే ఉంది. కానీ, తప్పు ఎక్కడ జరిగిందనే దానిని ఆలోచించా. సమాధానం మాత్రం నా వద్ద లేదు. ఐపీఎల్ తీరే అలా ఉంటుంది. రోజుల్లోనే ఫలితాలు మారిపోతాయి. ముగింపు దశలో చాలా సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికీ మేం మానసికంగా బలంగా ఉన్నాం. ధర్మశాల మ్యాచ్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’’ అని శాంసన్ తెలిపాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
* రాజస్థాన్ ఇన్నింగ్స్లో నలుగురు బ్యాటర్లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్కు చేరారు. యశస్వి, బట్లర్, అశ్విన్, కేఎం అసిఫ్ డకౌట్ అయ్యారు.
* అత్యధిక మార్జిన్తో ముగిసిన ఏడో మ్యాచ్. రాజస్థాన్పై బెంగళూరు 112 పరుగుల తేడాతో గెలిచింది. ఈ రికార్డు ముంబయి ఇండియన్స్ పేరిట ఉంది. 2017 సీజన్లో దిల్లీ క్యాపిటల్స్పై ముంబయి 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
* ప్రస్తుత విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. ఆర్సీబీకి (12 పాయింట్లు) ఇంకా రెండు మ్యాచ్లు ఉండటంతో ప్లేఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ 12 పాయింట్లతో ఆరో స్థానానికి దిగజారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్