IPL - 2022 : బలహీనతలను అధిగమిస్తేనే అత్యుత్తమ ఫలితాలు : మలింగ
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన పేసర్లతో తమ జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ అన్నాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆటగాళ్లు మెరుగ్గా రాణించేలా తీర్చిదిద్దుతానని పేర్కొన్నాడు...
(Photo : Malinga Twitter)
ఇంటర్నెట్ డెస్క్ : అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన పేసర్లతో తమ జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ అన్నాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆటగాళ్లు మెరుగ్గా రాణించేలా తీర్చిదిద్దుతానని పేర్కొన్నాడు. ఇటీవల మలింగను రాజస్థాన్ బౌలింగ్ కోచ్గా నియమించిన విషయం తెలిసిందే.
‘మా జట్టులో ట్రెంట్ బౌల్ట్, కోల్టర్ నైల్ వంటి అనుభవమున్న విదేశీ బౌలర్లు ఉన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైని లాంటి యువ పేసర్లు ఉన్నారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో మా జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉంది. ఐపీఎల్ లాంటి పొట్టి ఫార్మాట్లో బౌలర్లు ఇచ్చే కొన్ని పరుగులే.. జట్టు ఫలితాన్ని తారుమారు చేస్తాయి. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా వారికి మార్గ దర్శనం చేయడమే బౌలింగ్ కోచ్గా నా బాధ్యత. ప్రత్యర్థి జట్టులోని బలహీనతలపైనే చాలా మంది దృష్టి పెడుతుంటారు. కానీ, నా అనుభవం ప్రకారం.. మనలోని బలహీనతలను అధిగమించి అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లు సమతూకంగానే ఉంటాయి. మనం ఆటను ఎలా అర్థం చేసుకుంటామనేదే కీలకం. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేసేలా బౌలర్లను తీర్చి దిద్దుతాను’ అని మలింగ చెప్పాడు.
‘కోచ్గా బాధ్యతలు చేపట్టడం, బౌలర్గా నాకున్న అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవడం చాలా కొత్తగా అనిపిస్తోంది. ఇంతకు ముందు ముంబయి జట్టు తరఫున ఆడాను. ప్రస్తుతం రాజస్థాన్ జట్టుకు బౌలింగ్ కోచ్గా పని చేసే అవకాశం వచ్చింది. అద్భుతమైన టాలెంట్ ఉన్న యువ పేసర్లలో కలిసి పని చేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. నిజానికి గతేడాదే రాజస్థాన్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర ఆసక్తి ఉంటే బౌలింగ్ కోచ్గా చేరాలని కోరాడు. కానీ, కరోనా, బయో బబుల్ కారణంగా అది సాధ్యం కాలేదు’ అని మలింగ పేర్కొన్నాడు. 2019 సీజన్ వరకు మలింగ ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.