
IPL 2021: రాణించిన గైక్వాడ్.. రాజస్థాన్ లక్ష్యం 190 పరుగులు
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్తో మ్యచ్లో చెన్నై అదరగొట్టింది. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (101: 60 బంతుల్లో 9x4, 5x6) శతకంతో రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్మెన్ డుప్లెసిస్ (25), మొయిన్ అలీ (21) కూడా ఫర్వాలేదనిపించారు. సురేశ్ రైనా (3), రాయుడు (2) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన రవీంద్ర జడేజా (32) దూకుడుగా ఆడాడు. చెన్నై బ్యాటర్లు చివరి ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సులు సహా 22 పరుగులు రాబట్టారు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు, చేతన్ సకారియా ఒక వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.