Ramiz Raja: నాకు ఘోర అవమానం.. పీసీబీ కొత్త ఛైర్మన్పై రమీజ్ రజా తీవ్ర ఆరోపణలు
ఎప్పుడూ భారత్పై అక్కసు వెళ్లగక్కే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజాకి ఎదురు దెబ్బ తగిలేలా ప్రస్తుత పాలక కమిటీ వ్యవరించింది. తన కార్యాలయంలోని ఫైల్స్ను తీసుకొనేందుకు కూడా రమీజ్ను అనుమతించడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ రమీజ్ రజాకు తీవ్ర అవమానం జరిగింది. ఇప్పటి వరకు ఛైర్మన్ గిరీ వెలగబెట్టిన రమీజ్ రజాకు తన కార్యాలయంలోని వస్తువులను తీసుకొనేందుకూ అవకాశం లేకుండా పోయింది. దీనంతటికి కారణం కొత్త పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథి అని రజా తీవ్ర ఆరోపణలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో రమీజ్ రజా మాట్లాడారు. కేవలం ఒక్క వ్యక్తి కోసం పీసీబీ రాజ్యాంగం మార్చడం దారుణమని వ్యాఖ్యానించాడు. అలాగే తనకు సంబంధించిన వస్తువులను తీసుకోవడానికి కూడా అనుమతించడం లేదని మండిపడ్డాడు.
‘‘కేవలం ఒకే ఒక్క వ్యక్తిని తీసుకురావడానికి రాజ్యాంగాన్ని మార్చిన వైనం పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఉంది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది చూడలేదు. అదీనూ పాకిస్థాన్లో పర్యటించడానికి విదేశాలు వచ్చినప్పుడు.. సీజన్ మధ్యలో మార్పు చేయడం హేయమైన చర్య. పాక్ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన వారిలో ఒకరైన దిగ్గజ క్రికెటర్(ఇంజిమామ్)ను చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పించిన సేథి.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నన్ను తీసేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇదే నన్ను తీవ్రంగా బాధించింది. ఒక్కసారి కూడా బ్యాట్ పట్టని వ్యక్తి నన్ను అర్ధాంతరంగా తప్పించి పదవిలోకి వచ్చాడు. పాక్ క్రికెట్ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తామని చెబుతున్న ఆ వ్యక్తి.. కేవలం తన ప్రతిష్ఠను పెంచుకోవడానికే మొగ్గు చూపుతాడు’’
మూడేళ్ల కాలపరిమితితో పీసీబీ ఛైర్మన్గా వచ్చిన తనను కేవలం 12 నెలలకే పంపించడంపై కారణాలు కూడా వెల్లడించకపోవడం సరైంది కాదని రమీజ్ రజా అభిప్రాయపడ్డాడు. ‘‘మూడేళ్లపాటు ఉండాల్సిన పదవి నుంచి 12 నెలలకే ఎలాంటి కారణం చెప్పకుండా తప్పించడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. రాజకీయ వ్యక్తిని పదవిలోకి తెచ్చారు. ఇది పాక్ క్రికెట్కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. కెప్టెన్, జాతీయ జట్టు, సెలెక్షన్ టీమ్, క్రికెట్ బోర్డు.. ఇలా వ్యవస్థ మీద తీవ్ర ఒత్తిడి ఉంటుంది. నేను ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అసలు కొత్తగా వచ్చిన వారికి క్రికెట్పై ఎలాంటి ఆసక్తి లేదు. పీసీబీ రాజ్యాంగాన్ని నాశనం చేసేస్తారు. ఇది రాజకీయ ప్రతీకారంగా మారింది. దీనికి పీసీబీ బలిపశువు కానుంది’’ అని రమీజ్ రజా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం