ఆసీస్‌పై గెలుపు.. ఎక్కువ క్రెడిట్‌ రవిశాస్త్రికి.. ఎందుకంటే?

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియా విజయంలో హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికే ఎక్కువ క్రెడిట్‌ ఇస్తానని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ రమిజ్‌రాజా అన్నారు...

Published : 02 Feb 2021 01:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియా విజయంలో హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికే ఎక్కువ క్రెడిట్‌ ఇస్తానని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ రమిజ్‌రాజా అన్నారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అడిలైడ్‌లో భారత్‌ ఘోర పరాభవం పాలైన తర్వాత 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవడం విశేషమని ప్రశంసించారు. 

‘ఈ విజయంలో ఎక్కవ క్రెడిట్‌ కోచ్‌ రవిశాస్త్రికి ఇస్తా. ఎందుకంటే క్లిష్టపరిస్థితుల్లో.. స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినా జట్టును ముందుకు తీసుకెళ్లాడు. అలాగే ఏ జట్టుకూ తీసిపోమనే భావన డ్రెస్సింగ్‌ రూమ్‌లో కలిగించడం. ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులను వివరించడం అంత తేలికకాదు’ అని రమిజ్‌ పేర్కొన్నారు.  

‘ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంటే నాకెంతో ఇష్టం. జట్టులో ప్రతి ఒక్కర్నీ సరైన రీతిలో తీర్చిదిద్దాడు. ఆటగాళ్లలో పోరాడే కసిని పెంచాడు. ప్రస్తుత టీమ్‌లో అతడి పాత్ర చాలా ఉంది. అడిలైడ్‌లో టీమ్‌ఇండియా 36 పరుగులకే ఆలౌటయ్యాక రహానె జట్టుకెంతో అవసరమయ్యాడు. ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు నడిపించాడు. అతడు అద్భుతంగా పనిచేశాడు’ అని రమిజ్‌ టీమ్‌ఇండియా సారథులపై ప్రశంసలు కురిపించాడు. 

ఇవీ చదవండి..
అశ్విన్‌.. భజ్జీని దాటేస్తాడా?
బుమ్రా ఫాస్ట్‌ బౌలర్‌ కాదు.. లెగ్ స్పిన్నర్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని