Virat Kohli: అందుకే కోహ్లీకి అనిల్ కుంబ్లే నచ్చలేదు : రత్నాకర్ శెట్టి
లెజెండరీ స్పిన్నర్ అనిల్కుంబ్లే హెడ్కోచ్గా ఉన్నప్పుడు ఆటగాళ్లకు అండగా ఉండలేదని.. అలాగే డ్రెస్సింగ్ రూమ్లో ఇబ్బందికర పరిస్థితులు...
ఇంటర్నెట్డెస్క్: లెజెండరీ స్పిన్నర్ అనిల్కుంబ్లే హెడ్కోచ్గా ఉన్నప్పుడు ఆటగాళ్లకు అండగా ఉండలేదని.. అలాగే డ్రెస్సింగ్ రూమ్లో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాడని అప్పటి సారథి విరాట్ కోహ్లీ భావించినట్లు టీమ్ఇండియా మాజీ మేనేజర్ రత్నాకర్ శెట్టి పేర్కొన్నారు. తాను రాసిన ‘On Board: Test.Trial.Triumph. My years in BCCI’ పుస్తకంలోని పలు ఆసక్తికర విషయాలను ఆయన ఇటీవల బయటపెట్టారు. అందులో కుంబ్లే టీమ్ఇండియా హెడ్కోచ్గా తప్పుకోవడానికి గల కారణాలను కూడా ప్రస్తావించారు. కాగా, 2016లో టీమ్ఇండియా కోచ్గా నియమితుడైన మాజీ సారథి.. ఏడాది పాటు జట్టును నడిపించి చివరికి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు.
‘2016 మే నెలలో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్లో వీరేందర్ సెహ్వాగ్, సచిన్ తెందూల్కర్ను నేను వాంఖడే మైదానంలో కలిశాను. అప్పుడు సెహ్వాగ్ నాతో మాట్లాడుతూ.. తనని టీమ్ఇండియా హెడ్కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని నాటి బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ డాక్టర్ శ్రీధర్ సూచించాడని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత నేను ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్కు వెళ్లగా.. అక్కడే సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్) మీటింగ్ జరిగింది. అందులో కమిటీ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడల్జీతో పాటు నేనూ, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ (వర్చువల్గా) సమావేశమయ్యాము. ఆ సమావేశంలో టీమ్ఇండియా భవిష్యత్ ప్రణాళికలు, హెడ్కోచ్గా ఎవరిని ఎంపిక చేద్దామనే విషయాలను వినోద్ అందర్నీ అడిగారు. అయితే, ఆయనే మళ్లీ కలగజేసుకొని.. కుంబ్లేనే కోచ్గా కొనసాగిద్దామని చెప్పారు. దాంతో నేనూ, కుంబ్లే షాకయ్యాం’ అని రత్నాకర్ వివరించారు.
‘ఇక వినోద్ అలా చెప్పేసరికి అంతకుముందు సెహ్వాగ్ నాతో చెప్పిన విషయాన్ని కుంబ్లేతో పంచుకున్నా. కచ్చితంగా శ్రీధర్.. సెహ్వాగ్ను కోచ్గా దరఖాస్తు చేయాలని సూచించలేదని అప్పుడు నాకు అర్థమైంది. మరోవైపు అదే సమయంలో కుంబ్లేను కోచ్గా కొనసాగించడానికి కూడా పలువురు ఇష్టపడట్లేదని అనిపించింది. అలాగే జట్టులో విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లేల ఆలోచనా విధానాలు సైతం భిన్నంగా ఉన్నాయి. అప్పుడు కెప్టెన్దే పైచేయిగా సాగింది. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ముందు లండన్లో మరో సమావేశం జరిగింది. దానికి కోహ్లీ, కుంబ్లేతో పాటు శ్రీధర్ పలువురు బీసీసీఐ పెద్దలు హాజరయ్యారు. ఈ విషయం తర్వాత తెలిసింది. అయితే, కుంబ్లేతో కోహ్లీ సంతోషంగా లేడని.. ఆటగాళ్లకు అండగా ఉండకుండా డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు సృష్టిస్తున్నాడని విరాట్ ఫీలయ్యాడు. చివరికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ఇండియా ఓటమిపాలయ్యాక కుంబ్లే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు’ అని రత్నాకర్ తన పుస్తకంలో పొందుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM