Ravi Bishnoi : కొత్త చర్చకు తెరలేపిన రవి బిష్ణోయ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ..!
టీమ్ఇండియా యువ ఆటగాడు రవి బిష్ణోయ్ టీ20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్బై ప్లేయర్గా ఎంపికైన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు రవి బిష్ణోయ్ కొత్త చర్చకు తెరతీశాడు. ఏదో వ్యాఖ్యలు చేసి కాదు సుమా.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. టీ20 ప్రపంచకప్ జట్టులో బిష్ణోయ్ స్టాండ్బై ప్లేయర్గా ఎంపికైన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన స్క్వాడ్తోపాటు మరో నలుగురిని రిజర్వ్ ఆటగాళ్లుగా తీసుకొంది. అందులో సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, ఆల్రౌండర్ దీపక్ చాహర్తోపాటు స్పిన్నర్ రవి బిష్ణోయ్ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో తాజాగా రవి బిష్ణోయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ‘‘సూర్యుడు ఉదయిస్తాడు.. మేం మళ్లీ ప్రయత్నిస్తాము’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. టీ20ప్రపంచకప్ కోసం జట్టు ప్రకటన తర్వాత తొలిసారి రవి బిష్ణోయ్ స్పందించాడు. దేని గురించి ఇలా స్టోరీ పెట్టాడో అని అభిమానులు చర్చించుకొంటున్నారు.
(ఫొటో సోర్స్: రవి బిష్ణోయ్ ఇన్స్టాగ్రామ్)
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం అన్ని జట్లూ సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా రెండు టీ20 సిరీస్లతోపాటు వన్డే సిరీస్ను ఆడనుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆసీస్తో ఇవాళ మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆసీస్తో సిరీస్ ముగిశాక.. దక్షిణాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్లను టీమ్ఇండియా ఆడనుంది. ఇవన్నీ స్వదేశంలోనే కావడం గమనార్హం. ఈ సిరీస్లు ముగిశాక డైరెక్ట్గా భారత్ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్లోనే దాయాది దేశం పాకిస్థాన్తో టీమ్ఇండియా తలపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు