Ravi Shastri : నేను పొరపాటున కోచ్ అవతారం ఎత్తా.. రాహుల్ అలా కాదు: రవిశాస్త్రి
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడని మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. అదేవిధంగా ద్రవిడ్ భారత టీమ్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నాడని పేర్కొన్నాడు. ‘‘నేను కోచింగ్ బాధ్యతల నుంచి వీడ్కోలు పలికిన తర్వాత దానికి సరైన వ్యక్తి రాహుల్ ద్రవిడ్ మాత్రమే. ఇంకెవరూ కాదనేది నా అభిప్రాయం. అసలు నేనే పొరపాటున కోచ్గా మారా. కామెంట్రీ బాక్స్లో కూర్చొని ఉండే నాకు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. జట్టును నడిపించడంలో నావంతు కృషి చేశా. అయితే రాహుల్ మాత్రం నా మాదిరిగా కాదు. ఓ క్రమ పద్ధతిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. అండర్-19, టీమ్ఇండియా సెకండ్ టీమ్లకు కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. సీనియర్ జట్టుకు ప్రధాన్ కోచ్ అయ్యాడు. తన సలహాలు, సూచనలను టీమ్ సభ్యులు అందుకొని రాణిస్తే ఎలాంటి కోచ్కైనా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ద్రవిడ్ కూడా అందులోని కిక్ను ఎంజాయ్ చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు.
రవిశాస్త్రి హయాంలో భారత్ ఐసీసీ ట్రోఫీని మినహా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్లను కైవసం చేసుకొని అద్భుతాలు సృష్టించింది. ‘‘కోచ్గా మారిన వ్యక్తికి విమర్శలను పట్టించుకోని తత్వం ఉండాలి. అయితే నా చివరి రోజుల్లో మీడియాతో కాస్త కంగారు పడాల్సి వచ్చింది. ఆటగాళ్లు బాగా ఆడితే ఒకరకంగా.. విఫలమైతే మరో రకంగా వ్యాఖ్యలు వినాల్సి ఉంటుంది. అయితే మీడియా వల్లనే నా పని కాస్త తేలికగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే స్వదేశంలో తప్పితే విదేశాల్లో రాణించలేమనే మీడియా కథనాలను తప్పుగా నిరూపించడమే నా జాబ్గా భావించా. దాని కోసం జట్టుతో కూర్చొని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించా. విరాట్తో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు పిచ్ ఏదైనా సరే మనం 20 వికెట్లను తీయాలని చెప్పేవాడిని’’ అని రవిశాస్త్రి వివరించాడు. రాహుల్ ద్రవిడ్ హయం వచ్చేసరికి టీమ్లో సారథుల సంఖ్య ఎక్కువైపోయిందనే చెప్పొచ్చు. అందుకే వేర్వేరు సిరీస్లకు ప్రత్యేకంగా జట్టును తయారు చేసి మరీ బీసీసీఐ పంపించింది. రాబోయే టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను సిద్ధంగా ఉంచుకోవడానికి ఈ ప్రక్రియను చేపట్టింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
-
General News
Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- iPhone 14: యాపిల్ ప్రియులకు బ్యాడ్న్యూస్.. ఐఫోన్ 14 రాక ఆలస్యం?
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- CWG 2022: భారత్కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..
- Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!