Ravi Shastri : అప్పుడు ఇంగ్లాండ్తో ఐదో టెస్టు వాయిదా వేయడం.. సమర్థనీయమే: రవిశాస్త్రి
గతేడాది కరోనా కారణంగా ఇంగ్లాండ్తో వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ప్రారంభమైన మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి ...
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది కరోనా కారణంగా ఇంగ్లాండ్తో వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ప్రారంభమైన మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 338/7 స్కోరు చేసింది. రిషభ్ పంత్ (146) శతకానికితోడు రవీంద్ర జడేజా (83*) సమయోచిత ఇన్నింగ్స్ టీమ్ఇండియాను నిలబెట్టింది. ఈ క్రమంలో టెస్టు మ్యాచ్పై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పదించాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా రవిశాస్త్రినే టీమ్ఇండియా కోచ్గా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు.
‘‘గత ఏడాది కరోనా పరిస్థితుల్లోనూ క్రికెట్ ఆడండి అని చెప్పడం చాలా తేలికే. అయితే చాలా మంది ఆటగాళ్లు కుర్రాళ్లు. వారికి కుటుంబాలు ఉంటాయి. ఇక కొవిడ్ ఎవరి నుంచి వస్తుందనేది చెప్పలేని విషయం. కొవిడ్ సోకడం.. ముందు జాగ్రత్తగా ఐసోలేషన్లో ఉండటం ఒకటి కాదు. ఎనిమిది నెలల కిందట కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారులే చెప్పలేకుండా ఉన్నారు. ఇవాళ అదొక ఫ్లూ మాత్రమేనని చెబుతున్నారు. ఆ సమయంలో ఆడితే పోయేదేముందని చెప్పినవారు తమ మనస్తత్వం కారణంగానే ఆ విధంగా వ్యాఖ్యానించి ఉంటారు. పొరపాటున టెస్టు మ్యాచ్ మధ్యలో ఎవరికైనా కరోనా సోకితే మిగతా వారి పరిస్థితి భయంకరంగా ఉండేది. అందుకే అప్పుడు టీమ్ఇండియా ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడకుండానే వచ్చేయాలనే నిర్ణయం ముమ్మాటికీ సమర్థనీయమే. ఇప్పుడు దానిని మళ్లీ నిర్వహించడం అభినందనీయం‘’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. గత ఏడాది టెస్టు వాయిదా పడేనాటికి భారత్ 2-1 తేడాతో ఇంగ్లాండ్పై ఆధిపత్యంలో ఉంది. ఈ టెస్టు మ్యాచ్ ముందు కూడానూ టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ కరోనా బారిన పడటం గమనార్హం. దీంతో బుమ్రా జట్టు పగ్గాలను చేపట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు