MS Dhoni: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ధోనీ తిరిగొస్తే.. రవిశాస్త్రి సూపర్ ఆన్సర్!
వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు (WTC Final) టీమ్ఇండియా చేరుకుంది. ఆసీస్తో జూన్ 7వ తేదీ నుంచి తలపడనుంది. ఈ క్రమంలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final 2023) ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. జూన్ 7వ తేదీ నుంచి ఆసీస్తో ఫైనల్లో తలపడనుంది. అజింక్య రహానెకు అవకాశం ఇస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ మాజీలు ప్రశంసలు కురిపించారు. టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రికి ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది. అయితే, రవిశాస్త్రి మాత్రం చాలా క్లారిటీగా జవాబు ఇచ్చేశాడు.
‘‘ఎంఎస్ ధోనీని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు కదా. ఇప్పటికీ అతడు ఫిట్గా ఉన్నాడు. వికెట్ కీపర్ - బ్యాటర్గా సరిపోతాడు’’ అని రవిశాస్త్రిని యాంకర్ ప్రశ్నించగా..
దానికి సమాధానంగా.. ‘‘దేశంలో చాలా మంది యంగ్ వికెట్ కీపర్లకు ధోనీ మార్గదర్శి. అతడిని వికెట్ల వెనుక అనుసరించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే గొప్ప వికెట్ కీపర్గా ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాడు’’అని చెప్పాడు.
‘ఒకవేళ ధోనీ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని వస్తే అతడిని పరిగణనలోకి తీసుకుంటారా..? ’
‘‘ధోనీ రిటైర్మెంట్ను అస్సలు వెనక్కి తీసుకోడు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే అదే ఫైనల్ అవుతుంది. మరో సంవత్సరం ఆడే అవకాశం ఉన్నప్పటికీ.. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని భావించాడు. ఆ నిర్ణయం ప్రకటించాడు. అతడు గణాంకాలను చూసే ఆటగాడైతే.. 100 టెస్టుల మార్క్ను దాటాక గుడ్బై చెప్పే అవకాశం ధోనీకి ఉంది. భారీ ప్రేక్షక సందోహం మధ్య, అద్భుతమైన ప్రెజెంటేషన్, వీడ్కోలు కార్యక్రమం.. ఇలా ప్రతి ఒక్కరూ కోరుకొనే విధానంలో కాకుండా చాలా సింపుల్గా నిర్ణయం వెల్లడించాడు. ఇప్పుడు జట్టులో కొత్త ఆటగాడు ఉన్నాడు. వారిని ఆడించాలి’’ అని రవిశాస్త్రి తెలిపాడు.
ఇప్పుడు సమస్య అదే: గావస్కర్
జట్టు ఎంపికపై సునీల్ గావస్కర్ సంతోషం వ్యక్తం చేస్తూనే.. ఓ సందేహాన్ని లేవనెత్తాడు. రిషభ్ పంత్ గాయపడటంతో అతడి స్థానంలో వికెట్ కీపర్గా కేఎస్ భరత్ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఇప్పటికే జట్టులో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. అతడు కూడా కీపింగ్ చేయగల సమర్థుడే. ఈ క్రమంలో సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు మనం తుది జట్టు గురించే మాట్లాడుకోవాలి. ఇప్పటికే జట్టును ప్రకటించేశారు. ఎవరెవరు ఫైనల్ XIలో ఆడతారు? కీపర్గా ఎవరిని తీసుకుంటారు? కేఎస్ భరత్కు అవకాశం ఇస్తారా..? లేదా కేఎల్ రాహుల్ను వినియోగించుకుంటారా? అనేది తెలియాలంటే మనం వేచి చూడాలి’’ అని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత