T20 League : సంజూకు ఆ సత్తా ఉంది.. ఉమ్రాన్ పేస్ బాగుంది: రవిశాస్త్రి
ఎలాంటి మైదానంలోనైనా రాణించగలిగే...
ముంబయి: ఎలాంటి మైదానంలోనైనా రాణించగలిగే సత్తా రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ సొంతమని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సంజూ కేవలం 27 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ 210/6 భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 149/7కే పరిమితమైంది. ‘‘ సంజూ శాంసన్ చాలా బాగా ఆడాడు. షాట్ సెలెక్షన్ బాగుంది. టర్నింగ్ పిచ్ కాదనే విషయాన్ని గ్రహించి దానికి తగ్గట్లుగా బౌండరీలను బాదాడు. అంతేకాకుండా బౌలర్ల పేస్ను ఉపయోగించుకుని చూడచక్కని షాట్లు కొట్టాడు. అందుకే ప్రపంచంలోని ఏ మైదానంలోనైనా పరుగులు చేయగల సత్తా సంజూకి ఉంది. పుణెలో బ్యాటింగ్ చేయడం అతడికి చాలా ఇష్టం. గతంలో ఇక్కడే సెంచరీ కూడా కొట్టాడు. ఇంకో ఐదు ఓవర్లపాటు ఉండి ఉంటే రాజస్థాన్ స్కోరు 230 దాటేదే. దేవదుత్ పడిక్కల్తో మంచి భాగస్వామ్యం నిర్మించాడు’’ అని రవిశాస్త్రి వివరించాడు.
ఉమ్రాన్ మాలిక్ పేస్ బాగుంది..
రాజస్థాన్తో మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ ఫాస్ట్బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పేస్ ఎంతో ఆకట్టుకుందని రవిశాస్త్రి ప్రశంసించాడు. తొలి ఓవర్లోనే 21 పరుగులు సమర్పించుకున్న ఉమ్రాన్ ఆఖరికి 4 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 39 పరుగులే ఇచ్చాడు. ‘‘ఉమ్రాన్ నిలకడ, అతడి యాటిట్యూడ్ నచ్చాయి. నేర్చుకునే క్రమంలో ఉన్న మాలిక్ వద్ద అద్భుతమైన పేస్ ఉంది. సరైన ప్రాంతంలో బంతిని సంధిస్తే ఎంతటి బ్యాటరైనా కంగు తినాల్సిందే. అది అతడిని వాడుకోవడంపైనే ఆధారపడి ఉంది. ఉమ్రాన్తో కమ్యూనికేట్ చేసే విధానం చాలా ముఖ్యమని నా ఉద్దేశం’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి