Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
టీ20 ప్రపంచకప్ ఆరంభ సీజన్ 2007లో టీమ్ఇండియా ఛాంపియన్గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యంగా లీగ్ స్టేజ్ ఆఖరి దశలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్ ఆరంభ సీజన్ 2007లో టీమ్ఇండియా ఛాంపియన్గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యంగా లీగ్ స్టేజ్ ఆఖరి దశలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్(58; 16 బంతుల్లో 3x4, 7x6) రెచ్చిపోయి ఆడాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది జట్టు స్కోరును 200 దాటించాడు. అయితే, ఆరోజు వ్యాఖ్యాతగా ఉన్న టీమ్ఇండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి తాజాగా ఓ కార్యక్రమంలో యువీ సిక్సర్లపై స్పందించాడు. ఆరోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకున్నాడు.
‘2007 టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నాకు గుర్తుంది. ఆరోజు ఆండ్రూ ఫ్లింటాప్, యువరాజ్ సింగ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అదే యువీని రెచ్చిపోయేలా చేసింది. తొలి బంతి సిక్సర్గా వెళ్లింది. రెండు, మూడు బంతులు కూడా అలాగే వెళ్లాయి. నాలుగో బంతి సైతం స్టాండ్స్లోకి వెళ్లింది. దీంతో నా పక్కనే ఉన్న డేవిడ్ లాయిడ్ కుర్చీ నుంచి లేచి గంతులేశాడు. అదే సమయంలో నేను కొట్టిన ఆరు సిక్సుల సంగతి గుర్తొచ్చింది. అప్పుడు బ్యాట్స్మన్, బౌలర్.. ఏం ఆలోచిస్తున్నారో అని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఐదో బంతి కూడా సిక్సర్గా వెళ్లడంతో డేవిడ్ నన్ను కూడా కుర్చీలో నుంచి లేపాడు. దీంతో అప్పుడే యువరాజ్ ఆరో బంతిని కూడా సిక్సర్గా మల్చడానికి సిద్ధంగా ఉన్నాడని నేను కామెంట్రీలో చెప్పా’ అని శాస్త్రి నాటి విశేషాల్ని నెమరువేసుకున్నాడు. కాగా, 1985లో ఈ మాజీ ఆటగాడు కూడా రంజీ క్రికెట్లో ముంబయి తరఫున ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.