Ravi Shastri: వన్డేలను 40 ఓవర్లకు కుదించాలి: రవిశాస్త్రి
వన్డే క్రికెట్ గురించి టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే క్రికెట్ మనుగడ సాగించాలంటే ఈ ఫార్మాట్ను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించాలని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిప్రాయపడ్డాడు. 1983లో భారత్ ప్రపంచకప్ గెలిచిన సమయంలో వన్డేలు 60 ఓవర్లపాటు జరిగాయని గుర్తు చేస్తూ.. అభిమానుల ఆసక్తి తగ్గడంతో 50 ఓవర్లకు కుదించారని చెప్పాడు. వన్డేలను 40 ఓవర్లకు తగ్గించడానికి ఇదే సరైన సమయమని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
‘‘వన్డే క్రికెట్ మనుగడ సాగించాలంటే భవిష్యత్తులో ఈ ఫార్మాట్ను 40 ఓవర్లకు కుదించాలని భావిస్తున్నా. నేను ఇలా చెప్పడానికి కారణం.. 1983లో మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు వన్డేలు 60 ఓవర్లపాటు జరిగేవి. తర్వాత అభిమానుల ఆసక్తి తగ్గడంతో 50 ఓవర్ల ఆటగా మారింది. వన్డేలు 40 ఓవర్ల ఆటగా మారడానికి సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. కాలానికి తగినట్టుగా మన ఆలోచనలూ మారాలి. వన్డే ఫార్మాట్ను 40 ఓవర్లకు కుదించాలి’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టీ20ల గురించి మాట్లాడుతూ.. క్రికెట్కు టీ20 ఫార్మాట్ కీలకమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దేశీయ లీగ్లు తగినన్ని ఉన్నందున ద్వైపాక్షిక సిరీస్లను తగ్గించాలని సూచించాడు. టెస్ట్ క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు