French Open: ఆట ఉల్లాసాన్నే కాదు.. కన్నీళ్లూ పెట్టిస్తుంది!
నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది.
పారిస్: నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. బంతి ఆడే ప్రయత్నంలో కిందపడి, నొప్పితో విలవిలాడిన జ్వెరెవ్.. నిరాశతో ఆట మధ్యలో నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఆటలో కొదమ సింహాల్లా తలపడిన వీరు.. కోర్టు బయట ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని క్రీడా స్ఫూర్తిని చాటారు. దీనిపై నెటిజన్లు క్రీడా స్ఫూర్తి అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోపై మన క్రికెట్ దిగ్గజాలు కూడా స్పందించారు.
జ్వెరెవ్ తప్పుకోవాల్సి రావడంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి విచారం వ్యక్తం చేశారు. ‘ఇందుకే ఆటకు ఏడిపించే శక్తి కూడా ఉందనేది’ అంటూ ట్వీట్ చేశారు. జ్వెరెవ్ తప్పక తిరిగివస్తారని ఆకాక్షించారు. అలాగే రఫేల్ నాదల్ చూపిన క్రీడాస్ఫూర్తి, వినయం అమోఘం అంటూ కొనియాడారు. వారిద్దరు కలిసి ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. మన క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ కూడా నాదల్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. నాదల్ చూపిన వినయం, శ్రద్ధ ఆయన్ను ప్రత్యేకంగా నిలుపుతాయంటూ ట్వీట్ చేశారు.
ఈ సంఘటన మినహా ఎర్రమట్టి కోర్టులో రఫెల్ నాదల్ తన హవా కొనసాగించాడు. ఫ్రెంచ్ ఓపెన్ తుదిపోరుకు చేరుకున్నాడు. సెమీస్లో 7-6 (10-8), 6-6తో నాదల్ (స్పెయిన్) ఆధిక్యంలో ఉన్న దశలో జ్వెరెవ్ (జర్మనీ) గాయంతో తప్పుకున్నాడు. రెండు సెట్ల ఆట కూడా పూర్తి కాలేదు గానీ అందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టిందంటే ఆటగాళ్లిద్దరూ పాయింట్ల కోసం ఏ స్థాయిలో తలపడ్డారో అర్థం చేసుకోవచ్చు. బంతిని అవతలికి పంపే ప్రయత్నంలో కింద పడ్డ జ్వెరెవ్ కుడి కాలు చీలమండకు తీవ్ర గాయమైంది. నొప్పితో అరుస్తూ విలవిల్లాడాడు. బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నడవలేకపోవడంతో అతణ్ని చక్రాల కుర్చీలో బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వైద్యులు తేల్చడంతో చేతి కర్రల సాయంతో కోర్టులోకి వచ్చిన అతను.. నాదల్తో కరచాలనం చేసి, వీక్షకుల కోసం చేతులు గాల్లోకి ఊపాడు. అయితే అప్పటికే అతడి ఆటతీరుతో మురిసిన వీక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అలాగే అతడు కన్నీళ్లతో కోర్టును వీడటం నాదల్నూ బాధించింది. అతను ఎన్నో గ్రాండ్స్లామ్లు గెలవాలని కోరుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు