ఆటే కాదు బంధమూ బలపడింది
టెస్టుల్లో భారత్ నంబర్వన్గా నిలవడం, ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడంలో తెరవెనుక ప్రధాన కోచ్ రవిశాస్త్రి పాత్ర ఎంతో ఉంది. కుర్రాళ్లకు పెద్దన్నగా వ్యవహరిస్తూ...
సుందర్ బౌలింగ్పై దృష్టి పెట్టాలి
పంత్ శ్రమ ఫలిస్తోంది
ముంబయి
టెస్టుల్లో భారత్ నంబర్వన్గా నిలవడం, ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడంలో తెరవెనుక ప్రధాన కోచ్ రవిశాస్త్రి పాత్ర ఎంతో ఉంది. కుర్రాళ్లకు పెద్దన్నగా వ్యవహరిస్తూ.. అనుభవాన్ని పంచుతున్న ఈ మాజీ ఆల్రౌండర్.. ఇంగ్లాండ్పై భారత్ టెస్టు సిరీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. బయో బుడగ ఆటగాళ్ల మధ్య అనుబంధాన్ని పెంచిందని అంటున్న శాస్త్రి.. కుర్రాళ్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ప్రదర్శనపై ఆదివారం వర్చువల్ విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
బబుల్మంచే చేసింది..
భారత జట్టు బయో బుడగలో సుదీర్ఘ కాలంగా ఉంటుంది. ఇందులో ఉన్నప్పుడు ఆటగాళ్లకు వేరే అవకాశం ఉండదు. బయటకు వెళ్లలేరు. కొన్ని అనుమతించిన స్థలాల్లోనే తిరగాలి. బస చేసిన గది నుంచి బయటకు వస్తే జట్టు కలుసుకునే చోటకే వెళ్లాలి. అంటే దీని వల్ల మ్యాచ్ అయిన తర్వాత కూడా క్రికెటర్లు ఎక్కువసార్లు కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కలవడం వల్ల ఆట గురించి చర్చ వస్తుంది. మా సమయంలో ఇలా మ్యాచ్ అయ్యాక కూడా ఎక్కువసేపు ఆట గురించి మాట్లాడుకునే వాళ్లం. బయో బుడగలో క్రికెట్ తప్ప వేరే ఆలోచనకు చోటే లేదు. వాళ్లకు అది తప్పనిసరి అయింది. అంతేకాదు క్రికెటర్ల మధ్య అనుబంధం పెరిగింది. ఒకరి నేపథ్యం గురించి మరొకరు తెలుసుకోవడం, ఎక్కడి నుంచి వచ్చారో.. జీవితంలో స్థిరపడ్డారా.. ఇంకా స్థిరపడే దశలో ఉన్నారా.. మానసిక స్థితి ఎలా ఉంది లాంటి విషయాలను ఆకళింపు చేసుకునే అవకాశం కలిగింది. ఒకరితో ఒకరు వ్యక్తిగత విషయాలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం వల్ల బంధాలు బలపడ్డాయి. ఇలాంటి ఎన్నో సానుకూలాంశాలు బయో బుడగలో ఉన్నాయి.
అందుకే ఈ విజయాలు..
ప్రస్తుత భారత జట్టు గెలవడాన్ని గర్వంగా భావిస్తోంది. ఒక్కోసారి ఓటములు ఎదురైనా దిగులు పడట్లేదు. మళ్లీ సానుకూల ఫలితం వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూస్తోంది. ఆరు నెలలు ఆటగాళ్లు లాక్డౌన్లో గడిపిన సంగతి మాకు తెలుసు. అందుకే వారికి కుదురుకునే సమయం కావాలని అర్థం అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడిన తర్వాత మూడో వన్డేలో విజయం ఈ కోవకే చెందుతుంది. ఈ గెలుపు తర్వాత టీమ్ఇండియా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. టీ20లతో పాటు చరిత్ర సృష్టిస్తూ టెస్టు సిరీస్ నిలబెట్టుకుంది. తాజాగా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ ఓడినా... ఆ తర్వాత మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
అతడికి నాకన్నా ఎక్కువే..
80ల్లో అప్పటి కెప్టెన్లు సునీల్ గావస్కర్, కపిల్దేవ్లకు నేను సేవలందించినట్లే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుత భారత జట్టుకు ఉపయోగపడుతున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే నాతో పోలిస్తే సుందర్కు సహజసిద్ధమైన నైపుణ్యం మరింత ఎక్కువ. టెస్టుల్లో బౌలింగ్పై దృష్టి పెడితే అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. విదేశీ పిచ్లపై భారత్కు దొరికిన మెరుగైన ఆరో నంబర్ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. లోయర్ఆర్డర్లో అర్ధసెంచరీలు చేయడం.. 20 ఓవర్లు వేసి రెండు మూడు వికెట్లు తీయడం.. 80ల్లో భారత జట్టులో నా పాత్ర ఇదే. ఇప్పుడు సుందర్ ఇదే పాత్రను సమర్థంగా పోషించగలడు. అయితే దేశవాళీలో తమిళనాడుకు ఆడేటప్పుడు అతడు బ్యాటింగ్ ఆర్డర్లో తొలి నాలుగు స్థానాల్లో రావాలి. తమిళనాడు కెప్టెన్ దినేశ్ కార్తీక్తో ఈ విషయం గురించి మాట్లాడతా.
ఆ మార్పుల తర్వాత..
23 ఏళ్లలోపే రిషబ్ పంత్ నాలాగే విదేశాల్లో విజయవంతం అయ్యాడు. ఐపీఎల్ తర్వాత పంత్ చాలా బరువు పెరిగాడు. కానీ జిమ్లో కఠోరంగా శ్రమించి బాగా తగ్గాడు. ఆఫ్సైడ్ ఆటలోనూ మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ చూస్తోంది శ్రమ ఆ ఫలితాలే. తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడితే పంత్ తిరుగులేని మ్యాచ్ విన్నర్. ఆఫ్ స్పిన్నర్ అక్షర్పటేల్ జట్టుకు కొత్త ఆటగాడేం కాదు. చాలా ఏళ్లుగా జట్టుతోనే ఉంటూ వస్తున్నాడు. కానీ గాయాలు కావడంతో దురదృష్టం కొద్దీ జట్టుకు దూరమయ్యాడు. దీని వల్ల జడేజా, కృనాల్ పాండ్యలకు అవకాశాలొచ్చాయి. ఇప్పుడు గాయాల నుంచి కోలుకున్నాక దొరికిన అవకాశాన్ని రెండు చేతులతో సద్వినియోగం చేసుకున్నాడు. స్టార్ ఆల్రౌండర్ జడేజా లేని లోటుని అతను తెలియనీయలేదు. అశ్విన్, జడేజా, అక్షర్ కలిసి ఆడితే చూడాలని ఉంది.
ఎందుకు మార్చారో?
అక్టోబర్ వరకు టీమ్ఇండియా టెస్టుల్లో మూడు సిరీస్లు గెలిచి ఒక దాంట్లో ఓడి 360 పాయింట్లతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో ఉంది. కానీ ఒక వారం గడిచాక పరిస్థితి మారిపోయింది మేం మూడో స్థానానికి పడిపోయాం. దీనికి కారణం ఈ ఛాంపియన్షిప్లో నిబంధనను ఐసీసీ పాయింట్ల పద్ధతి నుంచి శాతాలకు మార్చింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించినా మేం పెద్దగా మెరుగుపడలేదు. ఒకవేళ ఆసీస్పై గెలవకపోతే స్వదేశంలో ఇంగ్లాండ్పై 4-0తో గెలిచినా ఫైనల్ అర్హత సాధించే వాళ్లం కాదేమో.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..