Ambani-pichai : అంబానీ.. పిచాయ్‌ని కలిపిన క్రికెట్‌ మ్యాచ్‌

ముకేశ్ అంబానీ.. సుందర్‌ పిచాయ్‌.. ఒకరేమో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త, లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్‌కు...

Published : 09 Aug 2022 18:41 IST

వారితో వీక్షించినట్లు రవిశాస్త్రి ట్వీట్‌

(ఫొటో సోర్స్‌: రవిశాస్త్రి ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్:  ముకేశ్ అంబానీ.. సుందర్‌ పిచాయ్‌.. ఒకరేమో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త, లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్‌కు అధినేత..  మరొకరు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన గూగుల్‌కు సీఈవో.. వీరిద్దరిని కలిపింది క్రికెట్‌. లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో మంగళవారం ఓ మ్యాచ్‌ను వారితో కలిసి టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి వీక్షించాడు. క్రికెట్ స్టేడియంలో ఉన్న ఫొటోను రవిశాస్త్రి తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. 

హండ్రెడ్‌ టోర్నమెంట్ రెండో ఎడిషన్‌లో భాగంగా లండన్ స్పిరిట్స్‌- మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ప్రస్తుతం రవిశాస్త్రి ఓ క్రీడా ఛానల్‌ తరఫున  వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.  ఈ మ్యాచ్‌ను చూసేందుకు ముకేశ్‌ అంబానీ, సుందర్‌ పిచాయ్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘క్రికెట్‌ను అభిమానించే ఇద్దరు దిగ్గజాలతో కలిసినప్పుడు..’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని