WTC Finals: అదే కివీస్కు ప్లస్.. టీమిండియాకు మైనస్!
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ కచ్చితమైన ప్రణాళికతో పాటు కలిసికట్టుగా బరిలోకి దిగుతుందని, దానికంటే ముందు ఇంగ్లాండ్తో రెండు టెస్టులు ఆడటం కూడా ఆ జట్టుకు కలిసివస్తుందని టీమ్ఇండియా...
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ కచ్చితమైన ప్రణాళికతో పాటు కలిసికట్టుగా బరిలోకి దిగుతుందని, దానికంటే ముందు ఇంగ్లాండ్తో రెండు టెస్టులు ఆడటం కూడా ఆ జట్టుకు కలిసివస్తుందని టీమ్ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. ఈ విషయంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా భారత్ జట్టు మారి అలవాటు పడాలని, అదే మనకు కీలకమని చెప్పాడు. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన సందర్భంగా ఛాంపియన్షిప్పై అతడు ఈ అభిప్రాయాల్ని వ్యక్తంచేశాడు.
అనంతరం ఇషాంత్ శర్మ మాట్లాడుతూ.. ఈ టెస్టు ఛాంపియన్షిప్ కష్టతరమైన ప్రయాణమని, అలాగే భావోద్వేగమైంది కూడా అని చెప్పుకొచ్చాడు. ఇది ఐసీసీ టోర్నమెంట్ అయినందున 50 ఓవర్ల ప్రపంచకప్ ఫైనల్తో సమానమన్నాడు. ఇక 2019లో వెస్టిండీస్తో ఈ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమైనప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఇది కేవలం నెల రోజుల కష్టం కాదని, రెండేళ్లు సాగే సుదీర్ఘ ప్రయాణమని పేర్కొన్నట్లు గుర్తుచేశాడు. అలాగే కొవిడ్-19తో ఈ టోర్నీలో నియమాలు మారినప్పుడు భారత్ కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు. క్లిష్టపరిస్థితుల్లోనే ఆస్ట్రేలియాపై విజయం సాధించామని, ఆపై ఇంగ్లాండ్తోనూ గెలుపొందామని ఇషాంత్ వివరించాడు.
ఇక ఆస్ట్రేలియా పర్యటనపై స్పందించిన షమి.. తమ రెండేళ్ల కష్టానికి అదే అసలైన పరీక్ష అని, అక్కడ విజయం సాధించడం కీలకమని పేర్కొన్నాడు. అందుకోసం తాము 110 శాతం కష్టపడాల్సి వచ్చిందన్నాడు. సీనియర్లు లేకున్నా యువ ఆటగాళ్లు కంగారూలపై సిరీస్ గెలవడం తనకు అమితానందం కలిగించిందని చెప్పాడు. ఆటగాళ్లు నేర్చుకునేందుకు ఆ టోర్నీ ఒక ఉదాహరణ అని, ఆ గెలుపుతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని షమి అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
-
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా