Ashwin: వారిద్దరి సరసన చేరేంత గొప్ప ఓపెనర్ మురళీ విజయ్: అశ్విన్
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మురళీ విజయ్ (murali vijay)పై రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) ప్రశంసలు కురిపించాడు. దిగ్గజ ఓపెనర్లతో పోలుస్తూ అభినందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్లో వంద మ్యాచ్లు ఆడటం ప్రతి క్రికెటర్ కల. ఇప్పుడు ఛెతేశ్వర్ పుజారా (pujara) ఆ మార్క్ను తాకేందుకు సిద్ధంగా ఉన్నాడు. దాదాపు రెండేళ్లపాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన పుజారా.. కౌంటీ క్రికెట్ ఆడి మరీ ఫామ్ సాధించాడు. పుజారాను అభినందిస్తూ తన యూట్యూబ్ ఛానెల్లో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (ashwin) మాట్లాడాడు. అలాగే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మాజీ ఓపెనర్ మురళీ విజయ్పైనా (murali vijay) అశ్విన్ ప్రశంసలు కురిపించాడు.
‘‘చాలాఏళ్ల నుంచి పుజారా నాకు తెలుసు. అతడి ఆట నుంచే కాకుండా వ్యక్తిగతంగానూ ఎన్నో అంశాలను నేర్చుకుంటూ ఉంటా. అతడు చాలా మొండిగా ఉంటాడు. పుజారాతో ఏదైనా విషయంపై వాదించి గెలవడం చాలా కష్టం. ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించడు. తనదైన శైలిలో అద్భుతమైన వివరణ ఇస్తాడు. అలా ఉండటం నేను చాలా ఆనందిస్తా. ఇక మురళీ విజయ్ విషయానికొస్తే.. అతడు అద్భుతమైన ఆటగాడు. సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాదిరి అత్యుత్తమ ఓపెనర్. పుజారా వీరికి కాస్త విభిన్నంగా ఉంటాడు. టెస్టు క్రికెట్లో కొత్త బంతితో ఆడటం అత్యంత క్లిష్టం. ఇలాంటి గొప్ప బాధ్యతలను మురళీ విజయ్ సరళంగా నిర్వర్తించాడు’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మురళీ విజయ్ తాజాగా ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐతో నా ప్రయాణం ముగిసింది. ఇక విదేశాల్లో అవకాశాలను వెతుక్కోవాలి. పోటీతత్వ క్రికెట్ను ఆడాలని అనుకొంటున్నా. ఇక్కడ (భారత్లో) ఎవరికైనా 30 ఏళ్లు దాటితే వారిని వయసు మళ్లినవారిగా చూస్తారు. అయితే నేనేమీ వివాదం చేయాలని చూడటం లేదు. మీడియా కూడా దీనిని విభిన్నంగా ప్రెజెంట్ చేస్తుంది. 30ల్లో ఉండి ఇక్కడకు వచ్చి కూర్చోవడం కూడా బాధగా ఉంటుంది. ఇప్పటికీ ఆడగలను. అదృష్టమో.. దురదృష్టమో.. అవకాశాలు మాత్రం చాలా తక్కువే. అందుకే బయట అవకాశాలను వెతుక్కోవాల్సి ఉంది’’ అని విజయ్ తెలిపాడు. భారత్ తరఫున 61 టెస్టులు ఆడిన మురళీ విజయ్ 12 సెంచరీలు, 15 అర్ధశతకాలతో 3,982 పరుగులు సాధించాడు. ఇక 17 వన్డేలు, 9 టీ20ల్లోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన