Cricket News: ఫ్రీ హిట్ × ఫ్రీ బాల్
క్రికెట్లో ఫ్రీహిట్ రద్దు చేయడానికి బదులుగా బౌలర్కు ఫ్రీబాల్ ఇవ్వాలని టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తన ప్రతిపాదన గురించి ఆలోచించాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులను కోరుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ఫ్రీహిట్ రద్దు చేయడానికి బదులుగా బౌలర్కు ఫ్రీబాల్ ఇవ్వాలని టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తన ప్రతిపాదన గురించి ఆలోచించాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులను కోరుతున్నాడు. సంజయ్ మంజ్రేకర్ రాసిన ఓ కథనానికి అతడిలా స్పందించాడు.
‘హాయ్, నేను రాసిన కథనంలోని అంశాలపై మీ అభిప్రాయం చెప్పగలరు. క్రికెట్ వీక్షణానుభవం మెరుగుపరిచేందుకు నిబంధనల్లో ఎలాంటి మార్పులు తెస్తే బాగుంటుంది’ అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. ‘ఫ్రీహిట్’ అనేది పోవాలని, అది బౌలర్లకు జరిగిన అన్యాయమని చెబుతూ రాసిన కథనం దానికి జోడించాడు. దీనిపై యాష్ స్పందించాడు.
‘కమాన్ సంజయ్, ఫ్రీహిట్ అనేది గొప్ప మార్కెటింగ్ టూల్. అభిమానులు దానికి ఆకర్షితులయ్యారు. అందుకే నాన్స్ట్రైకర్ బంతి వేయక ముందే క్రీజు దాటిన ప్రతిసారీ ఫ్రీ బాల్ ఇవ్వాలి. ఆ బంతికి వికెట్ రావాలి లేదా పది పరుగులను స్కోరు నుంచి తీసేయాలి’ అని అశ్విన్ అన్నాడు. ‘గుర్తుంచుకోండి.. బంతి చేతుల్లోంచి వదిలాకే నాన్స్ట్రైకర్ క్రీజు దాటాలి’ అని రెండోసారి ట్వీట్ చేశాడు. మరో మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా ‘దీనికి నేను అంగీకరించను. ఫ్రీబాల్కు వికెట్ పడితే ఫర్వాలేదు. లేదంటే అది డాట్ బాలే (10 పరుగులు తీసేయకూడదు)’ అని యాష్కు బదులిచ్చాడు. ‘న్యాయమేంటో చర్చిద్దాం! సమన్యాయం ఉండాలన్న తపనను మాత్రం కొనసాగిద్దాం. మీ నుంచి వచ్చిన ఆ స్ఫూర్తిని ప్రేమిస్తాను’ అని యాష్ బదులిచ్చాడు.
బౌలర్లు నోబాల్ వేస్తే బ్యాట్స్మన్కు ఉపయోగకరమైన ఫ్రీహిట్ను కొన్నేళ్ల క్రితం ఐసీసీ ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా బ్యాట్స్మన్ అనుకూలమైన నిబంధన. చాలామంది క్రికెటర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. బ్యాటు, బంతి మధ్య అంతరం పెరుగుతోందని, బ్యాట్స్మెన్ అనుకూల క్రీడగా క్రికెట్ మారుతోందని విమర్శిస్తున్నారు. అందువల్ల సమన్యాయం చేసేందుకు ఫ్రీబాల్ ప్రవేశపెట్టాలని యాష్ డిమాండ్ చేస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా