భగవంతుడా కాస్తా దయ చూపించు: అశ్విన్
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొన్నిసార్లు ఒకే రోజు 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకున్నప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్న టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించి సురక్షితంగా ఉండాలని సూచనలిస్తున్నాడు. సూచనలకే పరిమితం కాకుండా ఎన్95 మాస్క్లు కొనుగోలు చేసే స్థోమత లేనివారికి ఉచితంగా పంపిణీ చేస్తానని ఈ మధ్యే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు.
దేశంలో కొవిడ్ విజృంభణను దృష్టిలో ఉంచుకుని అశ్విన్ తాజాగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు.‘ఈ సంక్షోభమంతా ముగిసిన తర్వాత నన్ను లేపండి. ఇంకా ఎంతమంది ప్రజలు చనిపోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. దయచేసి మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించకపోవడం త్వరలో నేరంగా మారవచ్చు. దేవుడా కాస్తా దయ చూపించు’ అని ట్వీట్ చేశాడు.
జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ జరగనుంది. అనంతరం ఇంగ్లాండ్తో భారత్ ఐదు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఇందు కోసం బీసీసీఐ ఇటీవల జట్టులో కూడా ప్రకటించింది. దీంట్లో రవిచంద్రన్ అశ్విన్ కూడా చోటు దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా