Ravindra Jadeja: మేం బలం పుంజుకునేందుకు దారి కనుక్కోవాలి: జడేజా
ముంబయిలో జరుగుతోన్న మెగా టీ20లీగ్లో వరుసగా మూడు మ్యాచ్లు కోల్పోయి పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతున్న చెన్నై టీమ్ మళ్లీ గాడిలో పడాలంటే కొత్త దారి కనుక్కోవాల...
ముంబయి: మెగా టీ20 లీగ్లో వరుసగా మూడు మ్యాచ్లు కోల్పోయి పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతున్న చెన్నై టీమ్ మళ్లీ గాడిలో పడాలంటే కొత్త దారి కనుక్కోవాలని ఆ జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా అన్నాడు. గతరాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 54 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన జడ్డూ తమ జట్టు ఓటమికి గల కారణాలపై స్పందించాడు.
‘మేం పవర్ప్లేలో చాలా వికెట్లు కోల్పోయాం. తొలి బంతి నుంచే మేం వెనుకబడిపోయాం. మేం బలంగా పుంజుకొని రావడానికి కొత్త దారి కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కి భరోసా ఇవ్వాలి. అతడికి అండగా ఉండాలి. అతడెంత మంచి ఆటగాడో మా అందరికీ తెలుసు. కచ్చితంగా అతడి విషయంలో అండగా ఉంటాం. రాబోయే మ్యాచ్ల్లో అతడు రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్లో శివమ్ దూబె అద్భుతంగా ఆడుతున్నాడు. అతడిని ఇలాగే సానుకూల దృక్పథంతో ఉంచగలిగితే మా జట్టుకు కలిసివస్తుంది. ఇకపై శక్తి మేరకు ప్రయత్నించి తిరిగి బలం పుంజుకుంటాం’ అని జడేజా అన్నాడు.
లివింగ్స్టోన్ ఆడితే ఊపిరి బిగబట్టి చూస్తారు: అగర్వాల్
పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ.. 180 పరుగులు ఛేదించడం అంత తేలిక కాదన్నాడు. ‘ముఖ్యంగా కొత్త బంతితో వికెట్లు తీస్తే పని తేలికవుతుంది. ఈ మ్యాచ్లో అదే చేశాం. ఆదిలోనే వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్పై పట్టు సాధించి గెలుపొందాం. ఇక లివింగ్స్టోన్ ఎలా ఆడాలనేది నేనేం చెప్పలేదు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి చూస్తారు. లివింగ్స్టోన్ ఆడే కొన్ని షాట్లు చూడముచ్చటగా ఉంటాయి. వైభవ్ అరోరా కూడా మంచి నైపుణ్యం కలిగిన ఆటగాడు. ఇకపైనా సానుకూల దృక్పథంతో ఇలాగే ఆడి విజయాలు సాధించాలనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు.
కాగా, పంజాబ్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకటి ఓటమిపాలై.. రెండు విజయాలు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు