IND vs ENG:ఆసుపత్రిలో చేరిన రవీంద్ర జడేజా..కారణం ఏంటో తెలుసా?

లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం

Published : 29 Aug 2021 17:06 IST

 

ఇంటర్నెట్ డెస్క్‌: లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

అయితే, ఈ మ్యాచ్‌ ముగిసిన గంటల వ్యవధిలోనే టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసుపత్రిలో చేరాడు. ఈ టెస్టులో రెండో రోజు (గురువారం) ఫీల్డింగ్‌ చేస్తుండగా.. జడేజా మోకాలి గాయం తిరగబెట్టింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత జట్టు యాజమాన్యం అతనికి స్కానింగ్ చేయించింది. స్కానింగ్‌ రిపోర్టులో గాయం తీవ్రత తక్కువగా ఉందని తేలితే..  ఓవల్ వేదికగా సెప్టెంబరు 2న ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు జడేజా అందుబాటులో ఉంటాడు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు