MS Dhoni - Ravindra Jadeja: ధోని, జడేజా మధ్య వాగ్యుద్ధం!

చెన్నై సూపర్‌కింగ్స్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో దిల్లీని ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Updated : 22 May 2023 07:43 IST

దిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో దిల్లీని ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే శనివారం మ్యాచ్‌ అనంతరం చెన్నై కెప్టెన్‌ ధోని, ఆల్‌రౌండర్‌ జడేజా మధ్య ఏదో విషయంలో వాదన జరగడం ఆసక్తిరేపుతోంది. కానీ వాళ్ల సీరియస్‌ చర్చకు కారణమేంటో మాత్రం తెలియదు. ధోని దగ్గరకు వచ్చిన జడేజా అతడితో ఆట గురించి ఏదో మాట్లాడడం కనిపించింది. ధోని ముందు జడేజాపై చేయి వేయడం ద్వారా అతణ్ని శాంతపరిచి ఏదో వివరించాడు. క్రమంగా ధోని కూడా కాస్త తీవ్రంగా స్పందించాడు. ఆదివారం జడేజా ఎవరైనా కర్మ అనుభవించక తప్పదు అని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని