Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
ఇంగ్లాండ్తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (104) అద్భుత శతకంతో అదరగొట్టేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు....
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (104) అద్భుత శతకంతో అదరగొట్టేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రిషభ్ పంత్ (146)తో కలిసి 222 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. దీంతో భారత్ 416 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ 84/5 స్కోరుతో నిలిచింది. రెండో రోజు ఆట ముగిశాక ప్రెస్ కాన్ఫరెన్స్లో రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాట్లాడారు. ఈ క్రమంలో అండర్సన్ కామెంట్లపై జడేజా స్పందిస్తూ 2014 సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇంతకీ అండర్సన్ ఏమన్నాడు... జడ్డూ రియాక్షన్ ఏంటి..? ఎనిమిదేళ్ల కిందట ఏం జరిగిందో తెలుసుకోండి మరి..
రెండో రోజు ఆట ముగిశాక జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ.. ‘‘గతంలో రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చేవాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఏడో స్థానంలో రావడం వల్ల క్రీజ్లో కుదురుకునేందుకు ఛాన్స్ దక్కింది. సరైన బ్యాటర్గా బ్యాటింగ్ చేశాడు. దీంతో మాకు కష్టాలు తప్పలేదు’’ అని పేర్కొన్నాడు. దీనికి సమాధానంగా జడేజా స్పందించాడు. ‘‘పరుగులు చేసినంత కాలం బానే ఉంటుంది. మంచి బ్యాటర్ అని ప్రతి ఒక్కరూ అంటుంటారు. అయితే ఇవేవీ నేను పట్టించుకోను. ఎప్పుడైనా సరే క్రీజ్లో సమయం గడిపేందుకు వంద శాతం ప్రయత్నిస్తా. నాన్స్ట్రైకింగ్లో ఉన్న బ్యాటర్తో భాగస్వామ్యం నిర్మించేందుకు చూస్తా. అండర్సన్ కామెంట్లు విన్నాను. 2014 ఘటన తర్వాత అండర్సన్ నన్ను మంచి బ్యాటర్గా మెచ్చుకునేలా ఇప్పుడు జ్ఞానోదయం కలగడం బాగుంది’’ అని జడేజా వివరించాడు.
ఇంతకీ 2014లో ఏం జరిగిందంటే..?
2014లో ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు సందర్భంగా జడేజా, అండర్సన్ మధ్య పెవిలియన్ లోపల స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అకారణంగా జడేజాను అండర్సన్ పక్కకు తోశాడని ఇంగ్లాండ్ మేనేజ్మెంట్పై టీమ్ఇండియా మేనేజ్మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో నిబంధనల ప్రకారం లెవల్-3 కింద అండర్సన్పై ఐసీసీ చర్యలు తీసుకొంది. ఇప్పుడు ఆ సంఘటనను గుర్తు చేస్తూ జడేజా వ్యాఖ్యానించడం వైరల్గా మారింది.
ఇంగ్లాండ్ పిచ్లు చాలా కఠినం: జడేజా
‘‘ఇంగ్లాండ్ పిచ్లు స్వింగ్, పేస్కు బాగా సహకరిస్తాయి. అందుకే శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులనే ఆడాలి. బయట పడిన బాల్ను కవర్డ్రైవ్, స్క్వేర్ డ్రైవ్గా ఆడాలని ప్రయత్నిస్తే మాత్రం బ్యాట్కు ఎడ్జ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతులను వదిలేసేందుకే ప్రాధాన్యత ఇచ్చా. పొరపాటున ఆడామంటే స్లిప్లో దొరికిపోవడం ఖాయం. నా శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులనే బౌండరీలకు తరలించేందుకు ప్రయత్నించా. అదృష్టవశాత్తూ అలాంటివే ఎక్కువగా వచ్చాయి. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతులను వదిలేయడమే ఉత్తమం. రిషభ్ పంత్తో భాగస్వామ్యం నిర్మించడం బాగుంది. రిషభ్ ఆడేటప్పుడు నాపై ఒత్తిడి పెద్దగా లేదు. ఎందుకంటే ప్రతి బౌలర్ను పంత్ బాదేశాడు. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న నాపై బౌలర్ల దృష్టి పెట్టకపోవడానికి కూడా పంతే కారణం. క్రీజ్లో పాతుకుపోయి మరిన్ని పరుగులు చేయాలని
మాట్లాడుకుంటూ ఉన్నాం. చివరికి మంచి స్కోరునే నమోదు చేశామని భావిస్తున్నా’’ అని జడేజా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?