జోరుమీద బెంగళూరు.. పంజాబ్ పడగొట్టేనా?
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అదే ఉత్సాహంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో తలపడబోతోంది.
ఇంటర్నెట్డెస్క్: ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అదే ఉత్సాహంతో పంజాబ్ కింగ్స్తో తలపడబోతోంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. మరి కోహ్లీ సేన దూకుడుకు రాహుల్ కళ్లెం వేస్తాడా? పంజాబ్కు మూడో విజయం దక్కుతుందా?
ఆరంభం నుంచే అదరగొడుతూ..
గత సీజన్తో పోలిస్తే ఈ ఏడాది కోహ్లీ సేన పూర్తి భిన్నంగా కన్పిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క చెన్నై మినహా మిగతా అన్ని జట్లపై గెలిచి జోరు కొనసాగిస్తోంది. బ్యాటింగ్లో కోహ్లీతో పాటు మ్యాక్స్వెల్, డివిలియర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. దేవదత్ పడిక్కల్ కూడా మళ్లీ గతేడాది మెరుపులకు ప్రయత్నిస్తున్నాడు. ఇక బౌలింగ్ పరంగా మహ్మద్ సిరాజ్తో పాటు హర్షల్ పటేల్ ఔరా అనిపిస్తున్నాడు. చాహల్ ప్రదర్శన ఆశించినంత మేర లేకపోయినప్పటికీ అతడి అనుభవం పనికొస్తోంది.
కష్టపడుతోన్న పంజాబ్
మరోవైపు పంజాబ్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లాడిన ఈ జట్టు రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్ రాణిస్తున్నా.. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ వీరికి అండగా నిలవడం లేదు. ముఖ్యంగా మిడిలార్డర్ సమస్య వెంటాడుతూనే ఉంది. బౌలర్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఈ సీజన్లో రాహుల్ మూడు అర్థశతకాలు నమోదు చేసినప్పటికీ అతడి స్ట్రయిక్ రేట్ 129 మాత్రమే. అయితే, బెంగళూరుపై పంజాబ్కు మంచి రికార్డే ఉంది. గతేడాది రెండు సార్లూ కోహ్లీ సేనను ఓడించింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 26 సార్లు తలపడగా.. 14 విజయాలతో పంజాబ్ ఆధిక్యంలో ఉంది. ఈసారి కూడా గత వ్యూహాలను అమలు చేస్తే కోహ్లీ సేనను ఓడించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.