WPL: సోఫీ సెంచరీ మిస్‌.. ఆర్‌సీబీ ఘన విజయం

డబ్ల్యూపీఎల్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 18 Mar 2023 23:09 IST

ముంబయి: ఆర్‌సీబీ (RCB) విజయదుందుభి మోగించింది. డబ్ల్యూపీఎల్‌ (WPL)లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.189 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది. సోఫీ డివైన్‌ (99; 36 బంతుల్లో 9×4, 8×6) చెలరేగి పోవడడంతో గుజరాత్‌ స్కోరు చిన్నబోయింది. స్మృతి మంధాన (37) ఆమెకు చక్కని సహకారం అందించింది. లక్ష్య ఛేదన ప్రారంభించిన ఆర్‌సీబీని గుజరాత్‌ ఏ దశలోనూ నిలువరించలేక పోయింది.  ఓపెనర్లిద్దరూ  కలిసి తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కిమ్‌ గర్త్‌ బౌలింగ్‌లో  అశ్వని కుమారికి క్యాచ్‌ ఇచ్చి సోఫీ డివైన్‌ వెనుదిరడడం కాస్త నిరాశ కలిగించింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పెర్రీ (19*)తో కలిసి మంధాన ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. అయితే జట్టుస్కోరు 157 పరుగుల వద్ద స్నేహ్‌ రానా వేసిన  11.5వ బంతికి  మంధాన కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన  హీదర్‌ నైట్‌ (22*)తో కలిసి పెర్రీ లాంఛనాన్ని పూర్తి చేసింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌ లూరా వోల్వార్డ్‌ (68; 42 బంతుల్లో 9×4,2×6) అర్ధశతకంతో చెలరేగగా.. సబ్బినేని మేఘన (31; 32 బంతుల్లో 4×4), గార్డెనర్‌ (41; 26 బంతుల్లో 6×4, 1×6) రాణించారు.  ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంక పాటిల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. సోఫీ డివైన్‌, ప్రీతి బోస్‌ చెరో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని