భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా 3 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 97 ఓవర్లలో...
ఇంటర్నెట్డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా 3 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని 97 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 2-1 తేడాతో ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి సిరీస్ కైవసం చేసుకుంది. 2018-19లోనూ భారత్ 2-1 తేడాతోనే కంగారూలపై సిరీస్ కైవసం చేసుకొని తొలిసారి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులు చేసింది. అనంతరం కంగారూలు రెండో ఇన్నింగ్స్లో 294 పరుగులకు ఆలౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 33 కలుపుకొని భారత్ ముందు 327 లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా ఐదోరోజు 4/0 ఓవర్నైట్ స్కోర్తో బ్యాటింగ్ కొనసాగించి చివరి క్షణాల్లో విజయం సాధించింది. పంత్(89*) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్కు విజయాన్ని చేకూర్చాడు. దీంతో భారత్ కంగారూ గడ్డపై రెండోసారి చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే టెస్టు క్రికెట్లో పలు రికార్డులు, విశేషాలు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దామా..
టెస్టుల్లో చివరి రోజు అత్యధిక పరుగులు చేసిన సందర్భాలు..
* 1948 లీడ్స్ : 404(ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్)
* 1984 లార్డ్స్ : 344 (వెస్టిండీస్ vs ఇంగ్లాండ్)
* 2020/21 బ్రిస్బేన్ : 325(భారత్ vs ఆస్ట్రేలియా)
* 1977/78 పెర్త్: 317(ఆస్ట్రేలియా vs భారత్)
* 2017 లీడ్స్: 317(వెస్టిండీస్ vs ఇంగ్లాండ్)
తొలి టెస్టు ఓడాక భారత్ సిరీస్ గెలిచిన సందర్భాలు..
* 1972/73 సీజన్లో స్వదేశంలో ఇంగ్లాండ్పై 2-1 తేడాతో గెలుపు
* 2000/01 సీజన్లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలుపు
* 2015లో శ్రీలంక గడ్డపై ఆ జట్టుపైనే 2-1 తేడాతో విజయం
* 2016/17 సీజన్లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం
* 2020/21 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో గెలుపు
ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగుల ఛేదన..
* 2008/09 : పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 414 పరుగుల రికార్డు ఛేదన
* 1928/29 : మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 332 పరుగుల ఛేదన
* 2020/21 : గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ 329 పరుగుల ఛేదన
టెస్టుల్లో టీమ్ఇండియా అత్యధిక లక్ష్య ఛేదనలు..
* 1975/76 సీజన్లో వెస్టిండీస్పై 406 పరుగుల ఛేదన
* 2008/09 సీజన్లో ఇంగ్లాండ్పై 387 పరుగుల ఛేదన
* 2020/21 సీజన్లో ఆస్ట్రేలియాపై 328 పరుగుల ఛేదన
* 2011/12 సీజన్లో వెస్టిండీస్పై 276 పరుగుల ఛేదన
* 2001లో శ్రీలంకపై 264 పరుగుల ఛేదన
ఒకే వేదికపై ఓటమి లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన జట్లు
* 1955-2000 వరకు కరాచి స్టేడియంలో పాకిస్థాన్ 34 మ్యాచ్లు ఆడింది
* 1989-2019 వరకు గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా 31 మ్యాచ్లు ఆడింది.
* 1948-1993 వరకు కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్ 27 మ్యాచ్లు ఆడింది
* 1905-1954 వరకు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్ 25 మ్యాచ్లు ఆడింది
* 1958-1989 వరకు సెబీనా పార్క్లో వెస్టిండీస్ 19 మ్యాచ్లు ఆడింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!