Ganguly - Dhoni: యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా కూడా ఇలానే చేసింది : గంగూలీ
వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్నకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మెంటార్గా నియమించడాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సమర్థించుకున్నాడు. అతడి అనుభవం భారత జట్టుకు..
ఇంటర్నెట్ డెస్కు : వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్నకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మెంటార్గా నియమించడాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సమర్థించుకున్నాడు. అతడి అనుభవం భారత జట్టుకు కలిసొస్తుందని పేర్కొన్నాడు. 2019 యాషెస్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా కూడా ఇలానే చేసిందని గుర్తు చేశాడు. ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా ను మెంటార్గా నియమించిందని తెలిపాడు. ‘2013 నుంచి మన జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలువలేదు. అందుకే ఎంతో ఆలోచించి ధోనిని మెంటార్గా నియమించాం. పొట్టి క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. అతడి అనుభవం కూడా జట్టుకు కలిసొస్తుంది. ఒత్తిడిలో ఎలా రాణించాలనే దానిపై అతడు యువ ఆటగాళ్లకు మార్గదర్శనం చేయగలడు. 2019లో ఆస్ట్రేలియా కూడా ఇలానే చేసింది. యాషెస్ సిరీస్ సందర్భంగా ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా ను మెంటార్గా నియమించింది. దీంతో ఆస్ట్రేలియా మెరుగ్గా రాణించి 2-2తో సిరీస్ను సమం చేసింది. దిగ్గజ ఆటగాళ్ల అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడుతుంది’ అని గంగూలీ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!