Dhoni: ఐపీఎల్ తొలి వేలంలో ధోనీని ఎలా దక్కించుకున్నారంటే..?
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ విజయవంతమైన కెప్టెన్లలో ఒకడనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అతడికి ప్రత్యేకమైన అభిమాన గణం కూడా ఉంది...
ఈ టీ20 లీగ్లో తొలిసారి వేలం పాడింది చెన్నై సారథినే
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ విజయవంతమైన కెప్టెన్లలో ఒకడనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అతడికి ప్రత్యేకమైన అభిమాన గణం కూడా ఉంది. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (ఐదు సార్లు) తర్వాత అత్యధికంగా నాలుగు సార్లు ట్రోఫీ సాధించిన నాయకుడిగా ధోనీ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. 2016-17 సీజన్లలో చెన్నై నిషేధానికి గురైనా.. తర్వాత జరిగిన నాలుగు సీజన్లలో రెండు సార్లు జట్టును విజేతగా నిలిపాడు. అలాంటి గొప్ప సారథి 2008లో తొలిసారి జరిగిన ఐపీఎల్ వేలంలో ఎలా రంగ ప్రవేశం చేశాడో మాజీ ఆక్షనీర్ రిచర్డ్ మాడ్లీ (వేలం పాట నిర్వహించే వ్యక్తి) తాజాగా గుర్తు చేసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ నాటి విశేషాల్ని పంచుకున్నాడు.
ఐపీఎల్ తొలి వేలంలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్వార్న్ పేరును పరిచయం చేయగానే రాజస్థాన్ రాయల్స్ టీమ్ సొంతం చేసుకుందని చెప్పాడు. అప్పుడు అతడి కనీస ధర 4,50,000 డాలర్లకే రాజస్థాన్ సొంతమయ్యాడని మాడ్లీ తెలిపాడు. ఇక ధోనీ వేలంలోకి అడుగుపెట్టాక ఫ్రాంఛైజీల మధ్య పోటీ నెలకొందని పేర్కొన్నాడు. ‘2008లో తొలిసారి నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్.. షేన్వార్న్ను ఎలాంటి పోటీ లేకుండానే కొనుగోలు చేసింది. ఇక ధోనీ వేలంలో అడుగుపెట్టగానే ఫ్రాంఛైజీల మధ్య పోటీ నెలకొంది. అతడిని కొనుగోలు చేసేందుకు అందులో పాల్గొన్న జట్లు ఆసక్తి చూపాయి’ అని మాడ్లీ తన తొలి వేలం పాట రోజును నెమరువేసుకున్నాడు.
కాగా, అంతకుముందే ధోనీ 2007 టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాను విజేతగా నిలబెట్టడంతో వేలంలో దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ప్రధానంగా ఆసక్తి చూపాయి. చివరికి ముంబయి సచిన్ను ఎంపిక చేసుకోగా చెన్నై మహీని తీసుకుంది. అప్పుడు అతడి కనీస ధర 4 లక్షల డాలర్లు కాగా, చెన్నై 1.5 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. అయితే, తొలి సీజన్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ షేన్వార్న్ అనూహ్యంగా రాజస్థాన్ను విజేతగా నిలబెట్టాడు. మరోవైపు ధోనీ తనదైనశైలిలో చెన్నైని ముందుకు నడిపించి అత్యధికసార్లు ఈ టోర్నీలో ఫైనల్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే సీఎస్కేను నాలుగుసార్లు విజేతగా నిలబెట్టి అందరి మన్ననలు పొందుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!