IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్పై రికీ పాంటింగ్ జోస్యం
ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కున్న క్రేజే వేరు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కున్న క్రేజే వేరు. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. గతేడాది టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. మళ్లీ ఇప్పుడు యూఏఈ వేదికగా ఆసియాకప్లో ఈ నెల 28న ఇండో-పాక్ సమరం జరగనుంది. ఇరు జట్లు సూపర్ ఫామ్లో ఉండటంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు సహజం. దీంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అనే చర్చ మొదలైంది. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ఈ మ్యాచ్ విజేత ఎవరనేది జోస్యం చెప్పాడు.
పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎసిసోడ్లో మాట్లాడుతూ ‘ఏ టోర్నమెంట్లోనైనా టీమ్ఇండియా కఠిన ప్రత్యర్థే. ఇతర జట్లతో పోలిస్తే భారత్కు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్లో డెప్త్ ఉంది. ఇది ఆ జట్టుకి కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక ఆసియాకప్లో విజేత ఎవరంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో పాక్పై భారత్ ఆధిపత్యం చలాయిస్తే.. ఆసియా కప్లో మాత్రం ఇరుజట్లు 13 సార్లు తలపడితే.. భారత్ ఏడు గెలిస్తే.. పాకిస్తాన్ ఐదు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. కాబట్టి టోర్నీలో హోరాహోరీ పోరును అభిమానులు చూడొచ్చు. అయితే, నా దృష్టిలో మాత్రం భారత్ ఫెవరెట్గా కనిపిస్తోంది. నా ఓటు టీమిండియాకే.. ఆసియా కప్ కూడా టీమ్ఇండియానే గెలుస్తుందని నేను భావిస్తున్నాను. అయితే, పాక్ జట్టును అంత తేలికగా తీసేయడానికి లేదు. ఆ జట్టు ఈ మధ్య కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. నాణ్యమైన ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు సూపర్స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి పాక్తో టీమ్ఇండియాకు ప్రమాదం ఉంది’ అని రికీ విశ్లేషించాడు.
‘ఇంకో 15-20 ఏళ్లయినా సరే.. భారత్, పాక్ మ్యాచ్కున్న క్రేజ్ తగ్గదు. ఒక క్రికెట్ ప్రేమికుడిగా, పరిశీలకుడిగా ఇటువంటి మ్యాచులను చూస్తే ఆనందంగా ఉంటుంది. క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగానే చూస్తారు. కానీ యాషెస్ లాంటి టెస్టు సిరీస్కు మాత్రమే ఇది పరిమితం. అదే భారత్, పాక్ మధ్య ఉన్న ఆధిపత్య దోరణి అలా ఉండదు. ఏ ఫార్మాట్లోనైనా ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తిని పుట్టిస్తుంది’ అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక భారత్, పాక్ టెస్టు క్రికెట్లో తలపడితే చూడాలని ఉందని.. అసలు మజా టెస్టుల్లోనే ఉంటుందని పాంటింగ్ చెప్పాడు. టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్లు చివరిసారిగా 2007 బెంగుళూరు టెస్టులో ఆడాయి. అయితే, వచ్చే ఏడాది జరగనున్న టెస్టు ఛాంపియన్ షిప్లో ఈ రెండు జట్లు ఫైనల్కు వెళ్తే అభిమానులు సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఆసక్తికర పోరు చూసే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు