Ban vs Ind: రిషభ్ పంత్ అరుదైన రికార్డు.. ధోనీ తర్వాత రెండో వికెట్ కీపర్గా..
టీమ్ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టులో 46 పరుగులు చేసి ఔటైన పంత్ అంతర్జాతీయ క్రికెట్లో 4,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత వికెట్ కీపర్గా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టుల్లో సైతం టీ20 క్రికెట్ను మరిపించేలా దూకుడుగా ఆడే టీమ్ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ల్లో పంత్ (46; 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకానికి చేరువై ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా పంత్ అన్ని ఫార్మాట్లలో కలిపి 4,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో 4 వేల పరుగులు చేసిన రెండో భారత వికెట్ కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. పంత్ కంటే ముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni) అగ్రస్థానంలో ఉన్నాడు.
ధోనీ తన కెరీర్లో 535 మ్యాచ్లు ఆడి 44.74 సగటుతో 17,092 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 108 అర్ధ సెంచరీలున్నాయి. ఇక, రిషభ్ పంత్ (Rishabh Pant) ఇప్పటివరకు 128 మ్యాచ్లు ఆడి 33.78 సగటుతో 4,021 పరుగులు చేశాడు. వికెట్కీపర్గా పంత్ 109 మ్యాచ్ల్లో 3,651 పరుగులు చేయగా.. 6 శతకాలు, 15 అర్ధ శతకాలు బాదాడు.
ఈ మ్యాచ్లో పంత్ మరో రికార్డును కూడా అందుకున్నాడు. టెస్టుల్లో వేగవంతంగా 50 సిక్స్లు బాదిన రెండో భారత క్రికెటర్గా నిలిచాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ 54 ఇన్నింగ్స్లో ఈ ఘనతను సాధించగా.. పంత్ 51 ఇన్నింగ్స్ల్లోనే అందుకున్నాడు. ఓవరాల్గా టెస్టుల్లో 50 కంటే ఎక్కువ సిక్స్లు బాదిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు పంత్. ఈ జాబితాలో సెహ్వాగ్ 91 సిక్స్లతో మొదటి స్థానంలో ఉండగా ధోనీ (78), సచిన్ (69), రోహిత్ శర్మ (64), కపిల్ దేవ్ (61), గంగూలీ (57), రవీంద్ర జడేజా (55) సిక్స్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా