పంత్.. రూట్.. స్టోక్స్.. గరం గరం..!
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్ఇండియా 300/6 స్కోర్తో మెరుగైన స్థితిలో నిలిచింది. రోహిత్(161) భారీ శతకానికి తోడు రహానె(67) కీలక ఇన్నింగ్స్ ఆడాడు...
చెన్నై: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్ఇండియా 300/6 స్కోర్తో మెరుగైన స్థితిలో నిలిచింది. రోహిత్(161) భారీ శతకానికి తోడు రహానె(67) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రిషభ్పంత్(33) ధాటిగా ఆడి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అయితే, శనివారం ఆట చివరి ఓవర్ సందర్భంగా పంత్.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జోరూట్, బెన్స్టోక్స్తో మాటల యుద్ధానికి దిగాడు.
తొలి రోజు మొత్తం 88 ఓవర్ల ఆట సాగగా ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ 87వ ఓవర్ బౌలింగ్ చేశాడు. అయితే, పంత్ ఆ ఓవర్లో ఒక్కో బంతిని ఎదుర్కొనే క్రమంలో కాస్త ఆలస్యం చేశాడు. దాంతో తొలిరోజు ఆటను ఆ ఓవర్తోనే ముగిస్తారని భావించాడు. కానీ, పంత్ అనుకున్నట్లు జరగలేదు. ఆట నిలిచిపోయే సమయానికి ఇంకా ఒక నిమిషం ముందే రూట్ తన ఓవర్ను పూర్తి చేశాడు. దీంతో ఇంకో ఓవర్ ఆట సాగాల్సి వచ్చింది. బంతి అందుకున్న ఓలీస్టోన్ చివరి ఓవర్ను పూర్తి చేశాడు.
అయితే, స్టోన్ 88వ ఓవర్ వేయకముందు.. రూట్, స్టోక్స్, పంత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలుత టీమ్ఇండియా బ్యాట్స్మన్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఏదో అనుకోగా, తర్వాత స్టోక్స్ వచ్చి ఆజ్యం పోశాడు. దీంతో మళ్లీ పంత్, స్టోక్స్ మధ్య వాడీవేడీ సంభాషణలు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు ప్రశాంతంగా సాగిన తొలిరోజు ఆట చివర్లో ఇలాంటి పరిస్థితులకు దారి తీసింది. కాగా, చివరి ఓవర్లో పంత్ ఒక బౌండరీ బాది నాటౌట్గా నిలిచాడు. మరోవైపు అతడికి అక్షర్ పటేల్(5) తోడుగా నిలిచాడు.
ఇవీ చదవండి..
ఏమైంది రోహిత్? విరాట్ అమాయక ప్రశ్న!
రోహిత్ 97.. రితికా గుండె లబ్..డబ్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.