గబ్బా టెస్టు: 200 దాటిన భారత్‌

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. తాజాగా రిషభ్ పంత్‌(23) ఆరో వికెట్‌గా వెనుతిరిగాడు...

Updated : 17 Jan 2021 09:09 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. తాజాగా రిషభ్ పంత్‌(23) ఆరో వికెట్‌గా వెనుతిరిగాడు. హేజిల్‌వుడ్‌ వేసిన 66.3 ఓవర్‌కు మూడో స్లిప్‌లో గ్రీన్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 186 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(38) సైతం హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకుర్‌ ఉన్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 69 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోర్‌ 201/6గా నమోదైంది. 
ఇవీ చదవండి..
సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
శెభాష్‌ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని