Rishabh Pant: టీమ్ ఇండియా కోసం పంత్ మెసేజ్..!
భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టీమ్ ఇండియా కోసం ప్రత్యేక మెసేజ్ పోస్టు చేశాడు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకొంటున్న అతడు ఇంటి వద్ద మ్యాచ్ చూస్తూ తన ఇన్స్టాలో ఈ సందేశం ఉంచాడు.
ఇంటర్నెట్డెస్క్: 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC Final)లో భారత్ ఫైనల్స్ చేరుకోవడంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) పాత్ర చాలా ఉంది. మొత్తం 12 మ్యాచ్ల్లో పంత్ 43.40 సగటుతో 868 పరుగులు సాధించాడు. వీటిల్లో రెండు శతకాలు.. ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. కానీ, దురదృష్టవశాత్తూ గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో పంత్ ఇప్పుడు చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకొంటున్నాడు. తాజాగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను పంత్ ఇంటి వద్ద నుంచి వీక్షిస్తున్నాడు. పంత్ స్థానంలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ బరిలోకి దిగాడు.
ఫైనల్స్ రెండో రోజు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ కోసం పంత్ తన ఇన్స్టాలో ఓ ప్రత్యేక స్టోరీని పోస్టు చేశాడు. భారత్ జట్టు అదృష్టాన్ని కాంక్షిస్తూ క్రాస్డ్-ఫింగర్స్తో పాటు లవ్ సింబల్ ఎమోజీని పోస్టు చేశాడు. పంత్ పోస్టు చేసిన మెసేజ్లో ఆసీస్ బౌలర్ గ్రీన్ భారత బ్యాటర్ పుజారాకు బౌలింగ్ చేస్తున్న దృశ్యం ఉంది. నాన్స్ట్రైకర్ వైపు కోహ్లీ ఉన్నాడు. అప్పటికే భారత్ రోహిత్, గిల్ వికెట్లను కోల్పోయింది.
ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా విసిరిన 469 పరుగుల తొలి ఇన్నింగ్స్ను ఛేజ్ చేస్తూ భారత్ సగం వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే సాధించింది. ప్రస్తుతం రహానే, భరత్ క్రీజులో ఉన్నారు. ఆసీసు తొలి ఇన్నింగ్స్ స్కోర్ను అదిగమించాలంటే భారత్ మరో 318 పరుగులు చేయాల్సి ఉంది.
రిషబ్కు ప్రపంచ టెస్ట్ సిరీస్లో అద్భుతమైన రికార్డు ఉంది. 2019-21 సీజన్లో కూడా 41 ఇన్నింగ్స్లో 1,575 పరుగులు సాధించాడు. అప్పట్లో అతడు 41.44 సగటుతో మూడు శతకాలు, తొమ్మిది అర్ధశతకాలు బాదాడు. ఆ సిరీస్లో అతడి అత్యధిక స్కోరు 146.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ