Rishabh Pant: నేను చూసిన అతిగొప్ప ఇన్నింగ్స్ల్లో ఇదొకటి: రిషభ్ పంత్
గతరాత్రి హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ (92 నాటౌట్; 58 బంతుల్లో 12x4, 3x6) విధ్వంసక బ్యాటింగ్.. తాను చూసిన అతిగొప్ప ఇన్నింగ్స్ల్లో ఒకటని దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రశంసలు కురిపించాడు...
(Photo: Rishabh Pant Instagram)
ముంబయి: గతరాత్రి హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ (92 నాటౌట్; 58 బంతుల్లో 12x4, 3x6) విధ్వంసక బ్యాటింగ్.. తాను చూసిన అతిగొప్ప ఇన్నింగ్స్ల్లో ఒకటని దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. వార్నర్కు తోడుగా రోవ్మన్ పావెల్ (67 నాటౌట్; 35 బంతుల్లో 3x4, 6x6) దంచికొట్టడంతో నాలుగో వికెట్కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే వారిద్దరి బ్యాటింగ్ను కెప్టెన్ మెచ్చుకున్నాడు.
‘మేం మెరుగవ్వడానికి ఎప్పుడూ అవకాశాలు ఉన్నాయి. కానీ, బ్యాటింగ్ పరంగా ఈ మ్యాచ్ మాకు సరైన గేమ్లా అనిపించింది. మేం నిర్దేశించిన లక్ష్యం చూసి నేను ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే 200పై చిలుకు లక్ష్య ఛేదనలో ఏ జట్టు అయినా విజయం సాధించాలంటే ఓవర్కు 10-12 పరుగులు రాబట్టాలి. అలా 20 ఓవర్ల వరకూ ఆడటం అంత తేలిక కాదు. దీన్నిబట్టే మా బౌలర్లకు ప్రశాంతంగా ఉంటూ బౌలింగ్ చేయమని చెప్పా. ఇక వార్నర్ బ్యాటింగ్ విషయానికొస్తే.. అతడు ఆడిన విధానం, ఇన్నింగ్స్ను సాగించిన తీరు అమోఘం. నేను చూసిన అత్యుత్తమ బ్యాటింగ్లో ఇదొకటి. పావెల్ గురించి అందరికీ తెలిసిందే. అతడిని వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఇలా చెలరేగుతున్నాడు. ఇప్పుడు మేం ఒక్కో మ్యాచ్పైనే శ్రద్ధ వహిస్తున్నాం. అయితే, ఈ విజయం చాలా ముఖ్యమైనది’ అని పంత్ చెప్పుకొచ్చాడు.
అనంతరం డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. తనకు నచ్చినట్లు షాట్లు ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయన్నాడు. ‘ఈ వికెట్ చాలా బాగుంది. నాకు తోడుగా పావెల్ అద్భుతంగా ఆడాడు. ఇక హైదరాబాద్పై చెలరేగడానికి నాకేం అదనపు స్ఫూర్తి అవసరం లేదు. ఆ జట్టుపై విజయం సాధించడం గొప్పగా ఉంది. ఇక నేను ఆడిన స్విచ్ షాట్ (కుడి చేతి బ్యాటింగ్) బంతిని భువనేశ్వర్ యార్కర్ వేస్తాడని ఊహించా. కానీ, అతడు వికెట్లకు దూరంగా బంతిని వేశాడు. దీంతో నేను స్విచ్ షాట్కు ప్రయత్నించాను. సహజంగా ఈ షాట్ జోస్ బట్లర్ ఆడతాడు. దాన్ని నెట్స్లో సాధన చేసి ఇక్కడ ఉపయోగించాను. అయితే, తొలుత దాన్ని రివర్స్ షాట్ ఆడదామనుకున్నా.. కానీ, ఆ బంతి పడిన విధానం చూసి కట్ షాట్ ఆడాను’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ చివరి వరకూ పోరాడింది. ఆఖరికి 186/8తో నిలిచి 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ జట్టులో నికోలస్ పూరన్ (62) రాణించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?