Rishabh Pant: అఫ్రిదికి చేరువలో పంత్.. ఈసారి విరుచుకుపడితే రికార్డు బద్దలే!
ఎడ్జ్బాస్టన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో జాక్ లీచ్ బౌలింగ్ చేసి, పంత్ తనదైన శైలిలో చెలరేగితే అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టేస్తాడు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే బ్యాటర్లను చాలామందిని చూసుంటారు. అయితే రికార్డు స్థాయిలో బంతిని బ్యాటుతో చెడుగుడు ఆడేవాళ్లు తక్కువే. ఆధునిక టెస్ట్ క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్, షాహిద్ అఫ్రిది, ఆడమ్ గిల్క్రిస్ట్, బ్రెండన్ మెక్కల్లమ్ ఈ కోవకు చెందినవారు. వీరంతా క్రికెట్కు వీడ్కోలు పలికి చాలా కాలమవుతోంది. ప్రస్తుత క్రికెట్లో అయితే రిషబ్ పంత్, జానీ బెయిర్స్టో లాంటివారు తమ ఆటతో ఆ దిగ్గజ క్రికెటర్ల బ్యాటింగ్ శైలిని గుర్తుచేస్తున్నారు. వారి రికార్డులపై కూడా కన్నేశారు.
ఆధునిక టెస్టు క్రికెట్లో (2001 నుంచి ఇప్పటివరకు) ఒకే బౌలర్ బౌలింగ్లో అత్యధిక స్ట్రయిక్ రేట్తో వంద కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో షాహిద్ అఫ్రిది టాప్లో ఉన్నాడు. మన మాజీ స్పీడ్ స్టర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్లో అఫ్రిదీ 175 స్ట్రయిక్ రేట్తో (మొత్తం 7 ఇన్నింగ్స్లో) బ్యాటింగ్ చేశాడు. ఈ రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్ ఇప్పుడు రిషబ్ పంత్కి వచ్చింది. ఎడ్జ్బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్తో పంత్ జోరు కొనసాగితే... అఫ్రిదీ రికార్డు బద్దలవుతుంది.
తొలి ఇన్నింగ్స్లో పంత్ చెలరేగి ఆడి 89 బంతుల్లోనే శతకం బాదేశాడు. మొత్తంగా 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లిష్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్లో ఫోర్లు, సిక్సర్లతో పంత్ విరుచుకుపడ్డాడు. అలా అఫ్రిదీ రికార్డుకు చేరువయ్యాడు. లీచ్ను ఏడు ఇన్నింగ్స్లో ఎదుర్కొన్న పంత్ 161.53 స్ట్రయిక్ రేట్తో 147 పరుగులు చేశాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో జాక్ లీచ్ బౌలింగ్ చేసి, పంత్ తనదైన శైలిలో చెలరేగితే అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టేస్తాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో పంత్ 46 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. పంత్ తర్వాతి స్థానంలో 140.54 స్ట్రయిక్ రేట్తో ఆడమ్ గిల్క్రిస్ట్ ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత