పంత్కే ఐసీసీ తొలి పురస్కారం
టీమ్ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ మరో ఘనత అందుకున్నాడు. ఐసీసీ కొత్తగా ఆరంభించిన ‘ఈ నెల మేటి ఆటగాడు’ పురస్కారానికి ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా అమ్మాయి షబ్నిమ్ ఇస్మాయిల్ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.....
దుబాయ్: టీమ్ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ మరో ఘనత అందుకున్నాడు. ఐసీసీ కొత్తగా ఆరంభించిన ‘ఈ నెల మేటి ఆటగాడు’ పురస్కారానికి ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా అమ్మాయి షబ్నిమ్ ఇస్మాయిల్ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీసులో రిషభ్ పంత్ అదరగొట్టాడు. సిడ్నీ టెస్టులో 97, బ్రిస్బేన్ టెస్టులో 89* పరుగులు చేసి జట్టుకు సిరీస్ విజయం అందించాడు. అతడి ప్రదర్శనకు గాను ఐసీసీ ఈ పురస్కరాన్ని ప్రకటించింది. మరో ఇద్దరు నామినీలతో పోటీపడ్డ పంత్కు అత్యధికంగా ఓట్లు పడ్డాయి.
‘జట్టు విజయానికి తోడ్పాటు అందించడమే ఏ ఆటగాడికైనా అత్యుత్తమ బహుమానం. కానీ ఇలాంటి పురస్కారాలు ప్రతిసారీ మరింత మెరుగ్గా ఆడేందుకు యువకులకు ప్రేరణ అందిస్తాయి. నేనీ పురస్కారాన్ని ఆసీస్ విజయానికి కృషి చేసిన ప్రతి భారత క్రికెటర్కు అంకితమిస్తున్నాను. నాకు ఓటేసిన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు’ అని పంత్ తెలిపాడు. చెపాక్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో పంత్ 91 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
‘ఆస్ట్రేలియాలో పంత్ ఆడిన రెండు సందర్భాలు భిన్నమైనవి, సవాల్తో కూడుకున్నవి. ఒకటి డ్రా చేసేందుకు మరొకటి విజయం సాధించేందుకు ఉపయోగపడ్డాయి. ఈ రెండు ఇన్నింగ్సుల్లో అతడు తన నైపుణ్యాలను, వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. చక్కని టెంపర్మెంట్ను చూపించాడు’ అని ఐసీసీ ఓటింగ్ అకాడమీ ప్రతినిధి రమీజ్ రాజా అన్నాడు. పాకిస్థాన్ జరిగిన వన్డే సిరీసులో దక్షిణాఫ్రికా అమ్మాయి ఇస్మాయిల్ ఏడు వికెట్లు తీసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతకు ముందు జరిగిన రెండో టీ20లో ఐదు వికెట్లు తీయడం గమనార్హం. అందుకే ఆమెకు పురస్కారం దక్కింది.
ఇవీ చదవండి
కోహ్లీ 1 లేదా 2 సెంచరీలు కొడతాడు
ఉత్తరాఖండ్ బాధితుల కోసం పంత్ ముందడుగు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.