Mohammad Rizwan: ‘రిజ్వాన్‌ ప్లీజ్‌ అడాప్ట్‌ మి’.. వైరల్‌గా మారిన యువతి ఫొటో

పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య మంగళవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ‘రిజ్వాన్ ప్లీజ్ అడాప్ట్ మీ’ అని రాసి ఉన్న ఓ బ్యానర్‌ను పట్టుకున్న ఓ యువతి ఫొటో..

Published : 16 Dec 2021 01:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య మంగళవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ‘రిజ్వాన్ ప్లీజ్ అడాప్ట్ మీ’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకున్న ఓ యువతి ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌ జెర్సీ ధరించిన ఆ యువతి రిజ్వాన్‌కు మద్దతిస్తూ మ్యాచ్‌ ఆసాంతం సందడి చేసింది. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. అయితే, క్రికెట్ మ్యాచ్‌లో ఇలాంటి సరదా ఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ‘సీఎస్కే జెర్సీ ధరించేందుకు నా భార్య అనుమతించడం లేదు’ అని ఓ అభిమాని ప్రదర్శించిన బ్యానర్‌ కూడా అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.     

ఇదిలా ఉండగా, ఓపెనింగ్‌ బ్యాటర్ అయిన రిజ్వాన్‌ ఈ సంవత్సరం టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రిజ్వాన్ ఆడిన 27 మ్యాచుల్లో 75.06 సగటుతో 1,201 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రిజ్వాన్‌ రికార్డు సృష్టించాడు. ఇందులో ఓ శతకంతో పాటు 11 అర్ధ శతకాలు ఉండటం గమనార్హం.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని