Mohammad Rizwan: ‘రిజ్వాన్ ప్లీజ్ అడాప్ట్ మి’.. వైరల్గా మారిన యువతి ఫొటో
పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య మంగళవారం జరిగిన టీ20 మ్యాచ్లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ‘రిజ్వాన్ ప్లీజ్ అడాప్ట్ మీ’ అని రాసి ఉన్న ఓ బ్యానర్ను పట్టుకున్న ఓ యువతి ఫొటో..
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య మంగళవారం జరిగిన టీ20 మ్యాచ్లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ‘రిజ్వాన్ ప్లీజ్ అడాప్ట్ మీ’ అని రాసి ఉన్న బ్యానర్ను పట్టుకున్న ఓ యువతి ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది. పాకిస్థాన్ జెర్సీ ధరించిన ఆ యువతి రిజ్వాన్కు మద్దతిస్తూ మ్యాచ్ ఆసాంతం సందడి చేసింది. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. అయితే, క్రికెట్ మ్యాచ్లో ఇలాంటి సరదా ఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ‘సీఎస్కే జెర్సీ ధరించేందుకు నా భార్య అనుమతించడం లేదు’ అని ఓ అభిమాని ప్రదర్శించిన బ్యానర్ కూడా అప్పట్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, ఓపెనింగ్ బ్యాటర్ అయిన రిజ్వాన్ ఈ సంవత్సరం టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రిజ్వాన్ ఆడిన 27 మ్యాచుల్లో 75.06 సగటుతో 1,201 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రిజ్వాన్ రికార్డు సృష్టించాడు. ఇందులో ఓ శతకంతో పాటు 11 అర్ధ శతకాలు ఉండటం గమనార్హం.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి